రోజుకో మలుపు తిరుగుతున్న నటి హేమశ్రీ మర్డర్

 

కన్నడనటి హేమశ్రీ హత్యకేసులో కీలక వివరాలు ఒక్కొటొక్కటిగా బైటపడుతున్నాయి. బెంగళూరు పోలీసులు కార్పొరేటర్ మురళిని అదుపులోని తీసుకుని ప్రశ్నించినప్పుడు విస్మయం కలిగించే నిజాలు వెల్లడయ్యాయి. బెంగళూరు పోలీసులకు కార్పొరేటర్ మురళి చెప్పిన వివరాల ప్రకారం.. హేమశ్రీ మురళి కూతురు పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యింది. ఓమంత్రిగారినికూడా ఈ వేడుకలకు ఆహ్వానించారు. ఆయన కోరిక తీర్చమని హేమశ్రీని బలవంతపెట్టారు. ససేమిరా అనడంతో క్లోరోఫామ్ ని ప్రయోగించారు. మోతాదు ఎక్కువై హేమశ్రీ చనిపోయింది. మృతదేహాన్ని ఆమె భర్త సురేంద్రబాబు, మురళి కలిసి బెంగళూరుకి తీసుకెళ్లారు. బాప్టిస్ట్ ఆసుపత్రికి తీసుకెళ్లి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. హెబ్బాళ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉదయం నాలుగున్నరకల్లా సురేంద్రబాబు రెడ్డిపల్లి ఫామ్ హౌస్ కి హేమశ్రీ శవాన్ని తీసుకొచ్చాడు. అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. తప్పించుకునేందుకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులూ వేశారు. కానీ.. పోలీసులు హేమశ్రీ భర్త సురేంద్రబాబుకి మర్యాదలు చేసినప్పుడు నిజం కక్కేశాడు. మాజీ కార్పొరేటర్ మురళికికూడా అందాల్సిన ట్రీట్ మెంట్ అందేసరికి నిజాలు గడగడా బైటికొచ్చాయ్. బెంగళూరులో సురేంద్రబాబుపై పాతిక్కిపైగా కేసులున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.