మళ్లీ కోత వేళలు పెరుగుతాయా ?

రాష్ట్రంలో విద్యుత్తుకోత వేళాపాళా లేకుండా పోయిందన్న ఆందోళన నానాటికీ పెరుగుతోంది.  గతంతో పోల్చుకుంటే కొంత వరకూ నయమే అని రాష్ట్రప్రభుత్వం సమర్ధించుకుంటున్నా ప్రజలు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు ఉత్పత్తికి ఎన్నో అవరోధాలు ఎదురవుతుంటే కోత వేళలు పెరగకతప్పదని పరిస్థితి అర్థమవుతోంది. గతంలో శ్రీశైలం జల విద్యుత్యుత్పాదన కేంద్రంలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. యుద్ధ ప్రాతిపదికన మేల్కంటే అక్కడ ఉత్పత్తి ప్రారంభానికి ఓ వారంపైనే సమయం వృథా అయింది. ఇప్పుడు మళ్లీ వరంగల్‌ జిల్లాలోని కేటిపిఎస్‌ 5వదశలోని 9వయూనిట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 500మెగావాట్ల విద్యుత్తు ఆగిపోయింది. కేటీపిఎస్‌ బాయిలర్‌లో ఎయిర్‌ట్యూబ్‌ లీకేజీ కూడా ఇదే సమయంలో జరిగిందని అధికారులు గుర్తించారు. దీంతో ఇక్కడ ఇంకో 250మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. ఇలా రెండుయూనిట్లలో 750మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. రెండు రోజుల పాటు పునరుద్దరణ చర్యలు తప్పవని అధికారులు ధృవీకరిస్తున్నారు. రాష్ట్రంలో దీని ప్రభావం వల్ల కోత పెరుగుతుందని భావిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.