చంద్రబాబుని కదిలిస్తున్న జనం అవస్థలు

 

ఎక్కడికెళ్లినా ఆకలి కేకలు.. ఏ వైపు చూసినా పూట గడవడానిక్కూడా దిక్కులేని గడపలు.. రైతులు, చేనేతలు, వృత్తిపనివాళ్లు.. ఒకరేమిటి రాష్ట్రంలో అందరి పరిస్థితీ అధ్వాన్నంగానే ఉంది. జనం పడుతున్న బాధల్ని చూస్తుంటే చంద్రబాబుకి గుండె తరుక్కుపోతోంది. ఎలాగైనా ప్రజలకు మేలుచేయాలన్న తపన.. ఈసారి అధికారంలోకొస్తే తప్పనిసరిగా సామాన్యుల కష్టాలు తీర్చాలన్న దీక్ష.. చంద్రబాబుని పాదయాత్రలో ముందుకు నడిపిస్తున్నాయ్. కాళ్లనొప్పులు బాబుని బాధిస్తున్నాయ్. మట్టిరోడ్డుపై నడిస్తే కాస్త ఊరటకలుగుతుందేమోనని వైద్యులు సలహా ఇచ్చారు. ఫిజియోథెరపిస్టులు ఇస్తున్న సూచనల్ని చంద్రబాబు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. వాస్తవానికి ఆరోగ్య పరిస్థితి విషయంలో చంద్రబాబు ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సుంది. కానీ..జనం సమస్యలు ఆయన్ని నిలువనీయడంలేదు. ప్రజలు పడుతున్న బాధలు బాబుని స్థిమితంగా కూర్చోనివ్వడంలేదు.. ఇంకా ఇంకా ముందుకెళ్లాలన్న తపన.. జనం అవస్థల్ని తెలుసుకుంటే మళ్లీ అధికారమొచ్చాక వాటిని విరగడ చేయొచ్చన్న కసి.. చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అలుపెరగక చివరికంటా నడిచి పాదయాత్రను పూర్తి చేయాలన్న పట్టుదల చంద్రబాబులో గట్టిగా పాతుకుపోతోందంటున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.