కిరణ్ చాతగానితనంవల్లే రాష్ట్రంలో కరువు : మంత్రి డి.ఎల్

 

కిరణ్ పై మంత్రి డిఎల్ ఆరోపణల వర్షాన్ని కురిపిస్తున్నారు. కరువుని ఎదుర్కునే విధానాలు ప్రణాళికల్ని తనతోపాటు మరో ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రికి ఏకరువు పెట్టీపెట్టీ అలసిపోయామని డి.ఎల్ ఆరిపిస్తున్నారు. ఆరునెలలుగా తాము పడ్డ శ్రమ పూర్తిగా వృథా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పాతికేళ్ల రాజకీయ అనుభవం ఉందని, ఏ ఏ రంగాల్ని ఎలా చూసుకోవాలో తెలుసని, కేవలం లక్ష్యంలేని కారణంగానే ముఖ్యమంత్రి కిరణ్ తన మాటల్ని పెడచెవినపెడుతున్నారని డి.ఎల్ మండిపడుతున్నారు. “ నేనెన్నడూ చూడని దుర్భిక్షం రాష్ట్రాన్ని కాటేసింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయ్.. మంచినీళ్లు దొరకడంలేదు. సాగునీరందడంలేదు. వ్యవసాయానికి అన్యాయం జరుగుతోంది. విద్యుత్తు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. జిల్లాకి చెందిన ముగ్గురం మంత్రుల కీలకమైన రంగాలకు ప్రాథాన్యం ఇవ్వాలని కోరుతున్నాం. చాలాసార్లు ఈ విషయాల్ని సీఎంతో చెప్పాం. ఎంతగా వేడుకున్నా మా మాట పట్టించుకున్న పాపాన పోవడంలేదు. “ అంటూ సొంతపార్టీ సర్కారుమీద, ముఖ్యమంత్రి మీద మంత్రి డి.ఎల్ రవీంద్రారెడ్డి విరుచుకుపడ్డారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.