4 కోట్లకు కన్నెతనాన్ని అమ్మేసిన బ్యూటీ

 

బ్రెజిల్ యువతి కేటరీనా తన కన్యత్వాన్ని చాలా లాభానికి అమ్మేసుకుంది. ముందుగా అనుకున్నదానికంటే చాలా ఎక్కువ మొత్తంలో గిట్టుబాటు కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కేటరినా తన కన్యత్వాన్ని ఆన్ లైన్ లో ఆక్షన్ కి పెట్టినప్పుడు విపరీతమైన స్పందన కనిపించింది. దేశవిదేశాల్లో ఉన్న కోటీశ్వరులు కేటరీనా కన్నెతనాన్ని అందిపుచ్చుకునేందుకు పోటీలు పడ్డారు. వీళ్లలో ఓ భారతీయుడుకూడా ఉన్నాడు. 20 సంవత్సరాల వయసున్న కేటరీనా ఫిజికల్ ఎడ్యుకేషన్ చదువుతోంది. జపాన్ కి చెందిన నట్సూ 7 లక్షల 80 వేల డాలర్లకు కేటరీనా కన్నెతనాన్ని సొంతం చేసుకున్నాడు. నట్సూకి తన కన్నెతనాన్ని అప్పగించడానికి ముందు కేటరీనా అస్ట్రేలియానుంచి అమెరికాకు చేసే విమానం ప్రయాణంలో మీడియాకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూ ఇవ్వాలనుకుంటోంది. అయితే తనను మాత్రం మీడియాలో చూపించడానికి వీల్లేదని నట్సూ కండిషన్ పెట్టాడు. నట్సూకి తన అందాన్ని అర్పించినందుకు వచ్చే సొమ్ములో 90 శాతాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకి దానం చేస్తానని ఈ అమ్మడు చెబుతోంది. తన సొంత రాష్ట్రమైన కేటరీనాలో ఇళ్లు లేని నిరుపేదలకోసం తన సంపాదించే మొత్తాన్ని ఇవ్వాలని కేటరీనా ఉవ్విళ్లూరుతోంది. తర్వాత తన తాత్కాలిక ప్రియుడు రహస్య ప్రదేశంలో కామవాంఛలు తీర్చుకోవడానికి కేటీ సహకరిస్తుంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.