కేజ్రీవాల్ పార్టీలో అంతర్గత లోక్ పాల్

 

కేజ్రీవాల్.. యూపీఏ సర్కారుతోపాటు ప్రతిపక్ష నేతలకుకూడా పంటికింద రాయిలా నలుగుతూ ఇబ్బందిపెడుతున్న పేరిది. సమాచార హక్కు చట్టమనే బ్రహ్మాస్త్రాన్ని అడ్డంపెట్టుకుని కేజ్రీవాల్ సేకరిస్తున్న సమాచారం పొలిటీషియన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారుకదా.. అని ప్రతిపక్ష పార్టీలు సంబరపడేలోపే విపక్షంలో ఉన్న అవినీతి జలగల్ని రోడ్డుమీదికి లాగడం కేజ్రీవాల్ కి నిత్యకృత్యమైపోయింది. దీంతో అన్ని రాజకీయపార్టీలూ కలిసి కట్టుగా కేజ్రీవాల్ పై ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నాయ్. రివర్స్ గేర్ లో కేజ్రీవాల్ పార్టీలోని వ్యక్తులకు సబంధించిన వివరాలను సేకరించి వారిపై ఆరోపణలు గుప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్. ఇలాంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టేందుకు కేజ్రీవాల్ తెలివిగా ఓ ఉపాయాన్ని ఆలోచించారు. తన పార్టీలోని సభ్యులపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాల్ని నిగ్గుతేల్చేందుకు ముగ్గురు రిటైర్డ్ జడ్జ్ లతో ఓ ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేశారు. ఢిలీ హైకోర్ట్ ప్రథాన న్యాయమూర్తి జస్టిస్ ఎపి షా, బాంబే మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.హెచ్. మర్లపల్లె, ఢిల్లీ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిల్ జస్పాల్ సింగ్ ఈ బృందంలో సభ్యులు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.