సౌందర్య ఆస్ధి కోసం కొట్టుకుంటున్న బంధువులు

 

దివంగత నటి సౌందర్య మరణానంతరం ఆమె కుంటుంబం వార్తల్లో నిలిచించి చాలా తక్కువ. అయితే తాజాగా సౌందర్య కుటుంబీకులు ఆమె ఆస్తుల కోసం కోర్టుకు ఎక్కారు. 2004లో హెలీకాప్టర్ ప్రమాదంలో సౌందర్య, ఆమె సోదరుడు మరణించారు. అప్పటికే సౌందర్యకు వివాహం కూడా అయ్యింది. తాజాగా సౌందర్య భర్త, ఆమె తల్లి ఒక గ్రూపుగా, ఆమె అన్న భార్య ఒక గ్రూపుగా ఏర్పడి వివాదాన్ని పెద్దది చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ దాదాపు 50 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. వాటి పంపకాల విషయంలో వారి మధ్య విబేధాలు వచ్చాయి. అయితే అప్పటికే సౌందర్య వీలునామా రాసిందని అంటున్నారు. వీలునామా ప్రకారం ఒక ఇల్లు తన సోదరుని కొడుకు సాత్విక్‌కు, అప్పటికి నిర్మాణంలో ఉన్న మరో ఇంటిని తన తల్లికి, తన కుటుంబానికి, సోదరునికి కుటుంబానికి చెందేలా ఉమ్మడి ఆస్తిగా రాసినట్లు కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో ఆమెకు ఉన్న ఆస్తిపై వచ్చే ఆదాయంతల్లికి, సోదరుని కుటుంబానికి, భర్తకు, పిల్లలకు సమాన వాటాలుగా చెందాలని, మిగిలిన ఆస్తులు భర్తకు, పిల్లలకు చెందాలని వీలునామాలో రాసినట్లు చెబుతున్నాయి. సౌందర్య రాసిన వీలునామాకు విరుద్ధంగా ఆస్తి తనకు చెందకుండా తన నాయనమ్మ అడ్డుపడుతోందంటూ సాత్విక్ కోర్టుకెక్కడంతో వివాదం మొదలైంది. సౌందర్య 2003లో రాసినట్లు చెబుతున్న వీలునామా ఫోర్జరీ చేసినదంటూ ఆమె తల్లి మంజుల, భర్త రాఘు ఫిర్యాదు దాఖలు చేయడంతో, ఆమె సోదరుని భార్య న్యాయవాది వారిపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.