డోప్ టెస్టులో దొరికిన పాకిస్తాన్ స్పిన్నర్

పాకిస్తాన్ కు చెందిన స్పిన్నర్ అబ్దుర్ రెహ్మాన్ ఇంగ్లండ్‌లో నిర్వహించిన డోప్ టెస్టులో దొరికిపోయాడు. దీంతో అతనికి రెండేళ్లు నిషేధం పడే అవకాశం ఉంది. సోమర్‌ సెట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ముప్పయి రెండేళ్ల పాకిస్తాన్ లెఫ్టామ్ స్పిన్నర్ డోప్ టెస్టులో పట్టుబడినట్లు పాకిస్థాన్‌కు చెందిన ఓ స్థానిక పత్రిక పేర్కొంది. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి తెలియజేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకూ డోప్ టెస్టులో పట్టుబడీన వారిలో పాక్ నుంచి ముగ్గురు ఆటగాళ్ళు ఉన్నారు. గతంలో పేస్ బౌలర్లు మహ్మద్ ఆసిఫ్, షోయబ్ అక్తర్‌లు డోపీలుగా తేలారు. ప్రస్తుతం జరుగుతున్న టి-20 ప్రపంచకప్ జట్టులో రెహ్మాన్ సెలెక్ట్ కాలేదు. ఇప్పటి వరకు అబ్దుర్ రెహ్మాన్ 17 టెస్టుల్లో 81, 21 వన్డేల్లో 25 వికెట్లు పడగొట్టాడు. ఇదంతా ఎలా జరిగిందో తనకు తెలియదని, తను ఎలాంటి అనారోగ్యానికి సంబంధించిన మందులు కూడా వాడలేదని అంటున్నాడు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.