Read more!

నారాయణవనంలో శ్రీవేంకటేశ్వరస్వామి, పద్మావతిల కళ్యాణం

 

 

నారాయణవనంలో శ్రీవేంకటేశ్వరస్వామి, పద్మావతిల కళ్యాణం


 


కలియుగ దైవం వేంకటేశ్వరుని పేరు తలిస్తేనే కళ్యాణ వైబోగం. అలాంటి కలియుగ నాధుని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది. తిరుపలికి 40కి.మీ. దూరంలో పుత్తూరుకి 5 కి.మీ. దూరంలో, శ్రీ కళ్యాణ వేంకటేవ్వర ఆలయం కలదు. ఇది అరుణానదీ తీరంలో ఉన్న అతి ప్రాచీన ఆలయము. ఈ ఆలయం క్రీ.. 1544లో అచ్యుత దేవరాయల ఆంతరంగికుడైన పెనుగొండ వీరప్పన్నగారిచే నిర్మించబడినదని చర్రిత్ర చెప్పుచున్నది. ఈ వీరప్పన్నయే విరూపన్న అని తెలియుచున్నది. కాని స్థలపురాణం మాత్రం నారాయణవరం అధిపతి అయిన ఆకాశరాజుగారు కట్టించారని చెప్పుచున్నది. ఒకప్పుడు ఆ గ్రామాన్ని ఆకాశరాజు పరిపాలించుచున్న కాలంలో వైకుంఠనివాసుడైన శ్రీమహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర రూపంతో వెంకటాద్రి మీద వెలసాడు. అపుడాయన దేవేరి లక్ష్మీదేవి పద్మావతి రూపంతో ఆకాశరాజు దంపతులకు పుత్రికగా జన్మించింది. యుక్తవయస్సుకు వచ్చిన పద్మావతి దేవి వేంకటేశ్వరుని తప్ప మరొకరిని వివాహమాడనని తనకు ఆ స్వామితోనే వివాహం జరిపించవలసిందిగా తండ్రిని కోరింది. కుమార్తె కోరిక మన్నించిన ఆకావరాజు శ్రీవేంకటేవ్వర, పద్మావతిల కళ్యాణం ఈ ప్రదేశంలోనే అతివైభవంగా జరిపించాడని, ఈ కళ్యాణానికి ముక్కోటి దేవతలు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు వచ్చి తిలకించారని ప్రసిద్ధి.

 

 

ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ఆవరణ కలిగి ఉన్నది. ఈ ఆలవరణ చుట్టూ ఉన్నతమైన ప్రాకారము కలదు. ఈ ప్రాకారం తూర్పు దిశలో 96 అడుగుల ఎత్తుగల 7 అంతస్తులు గలిగిన గోపురంతో శిల్పకళా సౌందర్యంతో విరాజిల్లుచున్నది. ఈ ఆలయమందు గర్భగుడిలో కళ్యాణ వేంకటేశ్వరుడు ప్రక్కనే మరొక చిన్నగుడిలో పద్మావతీ అమ్మవారు దర్శనమిస్తారు. పద్మావతి అమ్మవారి ముందు పెద్ద తిరుగలి రాయి కలయి. ఆ తిరుగలితో ఆమె పెండ్లి రోజున బియ్యము విసిరినారని చెప్పుచుందురు.

ఈ ఆలయములో పద్మావతి, వేంకటేశ్వరులేకాక ఆళ్యారులు, దశావతారాలు, శ్రీవరదరాజస్వామి ఆండాళ్ళమ్మ, శ్రీకోదండరాముల వారు, శ్రీరంగ నాయకస్తామి, శ్రీరాజమన్నారుస్వామి, శ్రీ ప్రయాగస్వామి మున్నగువారు మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి కొంత దూరంలో నున్న పుష్కరిణిలో కార్తీక శుద్ధ దశమినుండి అయిదు రోజులు స్వామివారి తెప్పోత్సవము, జ్వేష్ఠ శుద్ధ దశమి నుండి పదిరోజులు బ్రహ్మాత్సవములు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.