Read more!

గురువారం శంఖంతో ఇలా చేస్తే జీవితమే మారిపోతుంది!

 

గురువారం శంఖంతో ఇలా చేస్తే జీవితమే మారిపోతుంది!

సనాతన ధర్మంలో, వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకి అంకితం చేస్తారు. విష్ణువు, బృహస్పతి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామిని గురువారం పూజిస్తారు. జాతకంలో బృహస్పతి దోషం ఉన్నవారు లేదా బృహస్పతి బలహీన స్థితిలో ఉన్నవారు గురువారం బృహస్పతిని పూజించాలి. గురువారాల్లో పూజ చేయడం, శంఖానికి సంబంధించిన ఈ పనులు చేయడం వల్ల మీ జీవితం కూడా మారిపోతుంది. శంఖానికి మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను దూరం చేసే శక్తి ఉంది. గురువారం శంఖంతో ఏం చేయాలో తెలుసుకుందాం.

శంఖానికి తిలకం పెట్టండి:

శాస్త్రం ప్రకారం, విష్ణువును పూజించేటప్పుడు శంఖం పెడితే త్వరలో విష్ణువు ప్రసన్నుడవుతాడు. ఈ రోజున శంఖంపై తిలకం వేయాలి. ప్రత్యేకించి, కుంకుమ తిలకం పూయడం ద్వారా శంఖాన్ని పూజించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

పూజలో శంఖాన్ని తప్పకుండా ఉపయోగించండి:

శంఖాన్ని పూజించడం ద్వారా, విష్ణువుతో పాటు లక్ష్మీ మాత మీకు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. గురువారం నాడు విష్ణుమూర్తికి పూజ, హారతి చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా శంఖాన్ని ఉపయోగించాలి. ఇది జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది.

శంఖం ధ్వని చేయండి:

హిందూ మతంలో, ఆరాధన సమయంలో శంఖం ఊదడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా విష్ణువును పూజించేటప్పుడు తప్పకుండా చేస్తారు. శంఖాన్ని ఊదినప్పుడు అది చేసే శబ్దం ఇంట్లో సానుకూలతను తెస్తుంది. ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుంది.

తులసి, శంఖం:

మీరు విష్ణువు ఆశీర్వాదం పొందాలనుకుంటే, గురువారం పూజ సమయంలో పూజలో తులసి ఆకులు, నీటితో నిండిన శంఖాన్ని ఉంచండి. శాస్త్రం ప్రకారం, ఇలా చేయడం వల్ల జాతకంలో గ్రహాల స్థితిని బలోపేతం చేయవచ్చు. ఈ శంఖ పరిహారాన్ని గురువారం రోజున ఆచరిస్తే, విష్ణువుకు తులసి చాలా ప్రీతికరమైనది కనుక ఆ వ్యక్తి విష్ణువు అనుగ్రహాన్ని పొందుతాడు.

శంఖం నీరు:

గురువారాల్లో విష్ణువు యొక్క ఆశీర్వాదం కోసం, ఒక శంఖాన్ని స్వచ్ఛమైన నీటితో నింపి, ఆ నీటిని సూర్య భగవానుడికి అర్ఘ్యంగా సమర్పించండి. ఇది మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు, సంపదను తెస్తుందని నమ్ముతారు.