వైసీపీ పిశాచాల్లారా.. ఇంత దిగజారారేంట్రా!?

అధికారం కోసం ఈ వైసీపీ పిశాచాలు అశుద్ధ భక్షణకు కూడా రెడీ అయ్యేట్టున్నాయి. చేజారిపోబోతున్న అధికారాన్ని మళ్ళీ ఎలాగైనా దక్కించుకుని, రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ నాయకులు పాతాళానికి దిగజారిపోతున్నారు. జూనియర్ఎన్టీఆర్ వైసీపీకి ప్రచారం చేస్తున్నట్టుగా, వైసీపీకే ఓటు వేయాలన్నట్టుగా ప్రకటనలు రెడీ చేసి సోషల్ మీడియాలోకి వదిలిపెడుతున్నారు. ఆ ప్రకటనల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతోపాటు ‘‘మా నాన్నగారి మరణానతరం నేను రాజకీయాలకు దూరంగా వుంటున్నాను. కానీ, సొంత రాజకీయ లబ్ధి కోసం ఆర్థికంగా వెనకబడి వున్న ముస్లిం మైనారిటీల 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామంటున్న బీజేపీతో కలసి ముస్లిం మైనారిటీలకు ద్రోహం చేయడం సరికాదు. దీనివల్ల ఎస్సా్ర్‌సీపీ గెలుపు అనేది దాదాపు ఖాయం అయినట్టే’’ అని మేటర్ కూడా వుంది. ఈ మేటర్ రాసిన ఫేక్‌గాళ్ళకి మేటర్ రాయడం కూడా వచ్చి చావదు. ‘గెలుపు ఖరారు అయినట్టే’ అని రాసి ఏడవచ్చుగా, ‘గెలుపు దాదాపు ఖరారు’ అయినట్టే అని రాశారు. అంటే, ఈ ఫేక్‌గాళ్ళకి కూడా తమ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం పూర్తిగా లేదన్నమాట. ఈ ప్రకటనలు చూసిన ఏపీ జనం ఓరి మీ మొహాలు మండ మరీ ఇంత దిగజారిపోయారేంట్రా అని తిట్టుకుంటున్నారు. 
Publish Date: May 9, 2024 11:48PM

పెనుకొండలో సవితమ్మ ప్రచారం అదరహో!

శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో  అశేష జనవాహిని మధ్య పెనుకొండ తెలుగుదేశం అభ్యర్థి శ్రీమతి సవితమ్మ ఎన్నికల ప్రచారం అద్భుతమైన రీతిలో జరుగుతోంది. ఉత్తేజం కలిగించే తెలుగుదేశం పార్టీ పాటలు మైకులలో వినిపిస్తూ వుండగా, తెలుగుదేశం కార్యకర్తలు పసుపుపచ్చ కండువాలను గాలిలో ఊపుతూ సందడి చూస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఈ రోడ్ షో కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, బిజెపి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Publish Date: May 9, 2024 11:30PM

జగన్ మళ్ళీ వస్తే చంద్రబాబుని చంపిస్తాడు!!

జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని చంపిస్తాడా? అవునని అంటున్నాడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే కచ్చితంగా చంద్రబాబుని హత్య చేయిస్తాడని దస్తగిరి కుండ బద్దలు కొట్టాడు. ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దస్తగిరి ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన వెనుక చంద్రబాబు వున్నాడని జగన్, అతని అనుచరులందరూ ఆరోపణలు చేస్తూ వుంటారని, వాటిలో ఎంతమాత్రం నిజం లేదని దస్తగిరి చెప్పాడు. చంద్రబాబుతో తనకు ఏదైనా లావాదేవీ వుంటే, ఈ ఐదేళ్లలో మీ పార్టీనే అధికారంలో వుంది కదా? ఆధారాలతో సహా బయటపెట్టి వుండొచ్చు కదా అని జగన్‌ని దస్తగిరి ప్రశ్నించాడు. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటే చంద్రబాబుతోపాటు తనని, సునీతని, మరికొందరిని తప్పకుండా చంపిస్తాడని దస్తగిరి అన్నాడు. ఈ ఘోరాలు జరగకుండా వుండాలనే తాను మళ్ళీ జగన్ అధికారంలోకి రాకూడదని, టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని దస్తగిరి అన్నాడు. ఈ ఐదేళ్ళుగా జరిగిన దారుణాలు ఆగిపోవాలంటే జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని దస్తగిరి అభిప్రాయపడ్డాడు. నేను హత్య చేశాను అని ధైర్యంగా చెబుతున్నానని, ఈ కేసులో లేనివాళ్ళని ఇరికించాల్సిన అవసరం తనకు లేదని దస్తగిరి వివరించాడు.
Publish Date: May 9, 2024 11:17PM

డొనాల్డ్ ట్రంప్ ఎంత‌టి శృంగార‌పురుషుడంటే... ఇరికించిన శృంగార తార!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాసలీలలు అన్నీ ఇన్నీ కావు. అమ్మాయిలంటే పడి చచ్చే ట్రంప్‌,  వారితో శారీరక సంబంధాల్ని కొన‌సాగించేవాడు. అధ్య‌క్ష‌ప‌ద‌వి చేప‌ట్ట‌క‌ముందు ప‌లువురు స్త్రీల‌తో శారీర‌క సంబంధాన్ని నెరిపిన ట్రంప్ ఆ త‌రువాత అధ్య‌క్ష ప‌ద‌వి పోటీ చేయాల‌నే ఉద్దేశంతో ..తాను స‌న్నిహితంగా ఉన్న మ‌హిళ‌లంద‌రిని దూరంగా పెట్టాడు. ట్రంప్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెల‌వ‌గా.. ఇప్పుడిప్పుడే ఇత‌ర స్త్రీల‌తో నెరిపిన అక్ర‌మ‌సంబంధాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. గతంలో ట్రంప్ ఓ శృంగార తార వెంటపడ్డారు. ఆమె అమెరికాలో పేరు ఉన్న పెద్ద పోర్న్‌ స్టార్‌. ఆమెతో ఒకటి రెండు సార్లు ఆయన తన రాస‌లీల‌లు కొనసాగించారు.  ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్ట‌కుండా వుండ‌టానికి తన లాయర్‌ మైఖేల్‌ కోహెన్‌ ద్వారా లక్షా 30 వేల డాలర్లు  ఆమెకు పంపి- ‘మన బంధంపై నోరెత్తవద్దు’ అని కోరారు. ఆమె ఆయన చెప్పినట్లే ఆయనతో సెక్స్‌ బంధంపై మౌనం దాల్చింది. కానీ ఈ చెల్లింపు మాత్రం బయటకు పొక్కింది. ట్రంప్‌ రసికత వెల గురించి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ గుట్టు ర‌ట్టు చేసింది. ట్రంప్‌ను తానెలా కలిసిందీ.. ఇద్దరి మధ్య శృంగారం ఎలా జరిగిందీ తదితర వివరాలను కోర్టులోని జ్యూరీ సభ్యులకు ఆమె తెలిపారు.  అధ్యక్ష ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్‌ అడ్డదారులు తొక్కారనే ఆరోపణలపై విచారణ జరుగుతున్న క్రమంలో న్యూయార్క్‌ కోర్టులో ఆమె వాంగ్మూలం ఇచ్చారు. ట్రంప్ త‌న‌ అంగరక్షకుడి ద్వారా డిన్నర్‌కు ఆహ్వానం పంపారు.  ఆయ‌న హోటల్‌ గదికి వెళ్లాను. అప్పుడు ఆయన సిల్క్‌ దుస్తుల్లో ఉన్నారు. ఆయన వస్త్రధారణ చూసి నాకు నవ్వొచ్చింది. దాంతో ఆయన షర్ట్‌, ప్యాంట్‌ వేసుకున్నారు. నేను బాత్రూమ్‌కు వెళ్లాను. తిరిగి వచ్చేసరికి ఆయన టీషర్ట్‌, షార్ట్‌లోకి మారిపోయారు. అప్పుడే ట్రంప్‌ భార్య ప్రస్తావన వచ్చింది. అందుకు ఆయన అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాను, తన భార్య ఒకే గదిలో ఉండటం లేదని చెప్పారు. కండోమ్‌ లేకుండానే ట్రంప్‌ నాతో శృంగారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో నా వయసు 27 ఏళ్లు.. ట్రంప్‌ వయసు నా తండ్రి కంటే ఎక్కువ ఉంటుందేమో’’ అంటూ వివరంగా ఆ రోజు ఏం జరిగిందో 45 ఏళ్ల స్టార్మీ డేనియల్స్‌ చెప్పారు.  ట్రంప్‌తో సంభోగాన్ని బయటపెట్టకుండా ఉండేదుకు 2016 ఎన్నికల సమయంలో 1 ల‌క్షా 30 వేల డాలర్ల మొత్తాన్ని ట్రంప్‌ న్యాయవాది మైఖేల్‌ కోహెన్‌ నుంచి స్వీకరించానని తన వాంగ్మూలంలో ఆమె పేర్కొన్నారు. 2006లో తాను ట్రంప్​తో లైంగికంగా కలిసినట్టు ఆమె​ తెలిపారు. ఇది ట్రంప్​ మూడో పెళ్లి మిలానియాతో జరిగిన ఏడాది అనంతర ఘటన! సరిగ్గా ఇక్కడి నుంచి దశాబ్ద కాలం తర్వాత డొనాల్డ్​ ట్రంప్​.. అమెరికా అధ్యక్షుడయ్యారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: May 9, 2024 6:52PM

జగన్‌కి ఓటేస్తే మీ ఆస్తి రాసిచ్చినట్టే!

రైతుల ఆస్తులను కొల్లగొట్టేందుకు ఉద్దేశించిన లాండ్ టైటిలింగ్ యాక్ట్.ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేయాలని జగన్ ప్రభుత్వం మొండి పట్టుదలతో వున్న నేపథ్యంలో, ఈసారి ఎన్నికలలో జగన్‌కి ఓటే్స్తే మీ ఆస్తి జగన్‌కి రాసిచ్చినట్టే అని చెప్పే స్టాంప్ పేపర్ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ‘‘2024 సంవత్సరం, మే నెల 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఫ్యాన్ గుర్తుపై నొక్కడం ద్వారా యావదాస్తిని దానంగా ఇస్తున్నాం. ఇక మీదట మాకు, మా కుటుంబ సభ్యులకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నాకు తెలిసి విజ్ఞతతో తీసుకున్న నిర్ణయం’’ అంటూ జగన్ ఫొటో వాటర్‌ మార్కుగా వున్న వంద రూపాయల స్టాంపు పేపర్ మీద రాసి వుంది. స్టాంపు పేపర్ మీద జగన్ ఫొటో, ఫ్యాన్ గుర్తు, మరోపక్క లాండ్ టైటిలింగ్ యాక్ట్.కి సంబంధించిన లోగో వుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ స్టాంప్ పేపర్ మీద ప్రజల్లో చర్చ జరుగుతోంది.
Publish Date: May 9, 2024 6:41PM

జగన్ విదేశీ పర్యటన.. గట్టిగా అభ్యంతరం చెప్పిన సీబీఐ

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం చెప్పింది.  ఎన్నికలు పూర్తి కాగానే కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు అనుమతించాలంటూ జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరుగుతుంది. ఆ తరువాత మే 17న కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించిన జగన్ అభ్యర్థనను అంగీకరించవద్దని సీబీఐ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ పై 11 కేసులు విచారణలో ఉన్నాయనీ ఈ సమయంలో ఆయన విదేశీ పర్యటనకు అనుమతించవద్దనీ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన అఫిడివిట్ దాఖలు చేసింది. సీబీఐ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో నేరుగా చెప్పకపోయినా.. ఆయన విదేశాలకు వెడితే తిరిగి వస్తారన్న నమ్మకం లేదని అర్ధం వచ్చేలాగే పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..జగన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించగానే  తెలుగుదేశం కూటమి నేతలు జగన్ పలాయనానికి రెడీ అయిపోయారని వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా సీబీఐ కూడా నేరుగా కాకపోయినా పరోక్షంగా కోర్టుకు తన అఫిడవిట్ లో అదే చెప్పింది. మే 15వ తేదీన జగన్ ప్రధాన కేసు విచారణ ఉందనీ, ఆ విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. అయితే జగన్ తరఫు న్యాయవాదులు యథాప్రకారం వితండ వాదనే చేశారు. విదేశాలకు వెళ్లే హక్కు రాజ్యాంగం కల్పించిందనీ, దానిని కాలరాయడమేంటని వాదించారు. వాస్తవానికి జగన్ ప్రస్తుతం కండీషనల్ బెయిలుపై ఉన్నారు.  బెయిలు షరతుల్లో అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదన్నది ఒకటి. అలాంటి సమయంలో విదేశీయానాన్ని అడ్డుకోవడం హక్కును కాలరాయడం అవుతుందని వాదించడం విచిత్రమేనని న్యాయనిపుణులు అంటున్నారు. ఇరువైపు వాదనలూ విన్న మీదట కోర్టు తదుపరి విచారణను మే 14కు అంటే పోలింగ్ తరువాతి రోజుకు వాయిదా వేసింది. గతంలో జగన్ విదేశీయానానికి అనుమతి అడిగిన ఏ సందర్భంలోకూ కోర్టు వాయిదా వేయకుండా వెంటనే అనుమతి ఇచ్చింది. ఈ సారి మాత్రం వాయిదా వేయడంతో జగన్ అభ్యర్థనను కోర్టు అంగీకరించే అవకాశాలున్నాయా? లేవా అన్న చర్చ జోరందుకుంది.  
Publish Date: May 9, 2024 5:55PM

కడప లోక్ సభ.. అవినాష్ కి మూడో స్థానమే.. పోటీ తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్యే!

జగన్ సామ్రాజ్యంగా చెప్పుకునే కడప లోక్ సభ స్థానంలో ఈ సారి ఆయన పార్టీ మూడో స్థానానికే పరిమితం కానుందా? అంటే స్థానికులు ఔననే అంటున్నారు. ఈ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగడంతోటే ఇక్కడ వైసీపీ గ్రాఫ్ దిగజారడం ఆరంభమైంది. ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య కేసులో ఏ8గా ఉన్న అవినాష్ రెడ్డికి  కడప లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలోకి దింపడంతోనే నియోజకవర్గంలో వైసీపీ అధినేత పార్టీ పతనాన్ని శాసించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా సీబీఐ అవినాష్ పేరు చేర్చిన తరువాత కడపలో రాజకీయపరిణామాలు వేగంగా మారిపోయాయి.  వివేకాహత్యకేసులో నిందితుడికి కడప లోక్ సభ  టికెట్ ఇచ్చిన అన్న జగన్ మోహన్ రెడ్డిని షర్మిల సూటిగా ప్రశ్నిస్తున్నారు. వివేకా కుమార్తె సునీత సైతం విస్తృతంగా ప్రచారం చేస్తూ అవినాష్ ఓటమి కోరుతున్నారు.  కడప లోక్ సభ స్థానం వైఎస్ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు తలపడటం ఇదే మొదటి సారి.  ఇదే స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ అవినాష్ విజయం కోసం షర్మిల ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో తాను  ప్రచారం చేసిన అవినాష్ కు ప్రత్యర్థిగా ఆమె కడప లోక్ సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. గత ఎన్నికలలో ఏ పార్టీ విజయం కోసమైతే షర్మిల శక్తికి మించి మరీ కృషి చేశారో అదే పార్టీ ఓటమి కోసం ఇప్పుడామె కంకణం కట్టుకున్నారు.   కడపలో తెలుగుదేశం అభ్యర్థి కూడా రంగంలో ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. షర్మిల పోటీలో నిలవడంతో వైసీపీ ఓట్లలో భారీగా చీలిక వస్తుందని తెలుగుదేశం భావిస్తోంది. అది తెలుగుదేశం పార్టీకి పెద్ద సానుకూలాంశంగా మారుతుందని చెబుతున్నది.  మొత్తం మీద నియోజకవర్గ పరిస్థితులను విశ్లేషిస్తూ పరిశీలకులు కడప లోక్ సభ ఎన్నికలలో ప్రధాన పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం మధ్యే ఉందంటున్నారు. వైసీపీ అభ్యర్థి మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి ఉంటుందని చెబుతున్నారు.   ముఖ్యంగా బద్వేల్, కడప, మైదుకూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గంలో అసంఖ్యాకంగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి అనుచరులు, అభిమానులు, మద్దతుదారులు ఈ సారి వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారనీ, వారంతా షర్మిలకు మద్దతు పలుకుతున్నారనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ కడప లోక్ సభ పరిధిలో బాగా వెనుకబడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: May 9, 2024 4:42PM

జబర్దస్త్ గా రోజా పరువు తీసేసిన కిర్రాక్!

ఆంధ్రప్రదేశ్ లో ప్రచార పర్వం ఈ శనివారం (మే 11) సాయంత్రంతో ముగియనుంది. అంటే నిండా మూడు రోజుల వ్యవధి కూడా లేదు. ఈ దశలో రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా సీని పరిశ్రమ వారు రంగంలోకి దిగి పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార రంగంలోకి దూకడంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా విశేష ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న నటుల ప్రచారం వైసీపీ శ్రేణులను గుబెలెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ కార్యక్రమానికి రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరించడంతో  వారి ప్రచారం వైసీపీకి  పెద్ద ఎత్తున డ్యామేజ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ నటుల గురించి రోజా చేసిన వ్యాఖ్యలకు క్రిర్రాక్ జబర్దస్త్ రిటార్డ్ ఇచ్చి ఆమె పరువును నిలువునా తీసేశారు. ఇంతకీ రోజా ఏమన్నారంటే.. జబర్దస్త్ నటులు చాలా చాలా చిన్న కళాకారులు అంటూ చులకనగా మాట్లాడడమే కాకుండా వాళ్లు కేవలం నాలుగు డబ్బుల కోసం మాత్రమే  వారు పనన్ తరఫున ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. అదీ కాక, ఇప్పుడిప్పుడే సినిమాలలో వేషాలు వేస్తున్న వారు పవన్ కోసం ప్రచారం చేయకుంటే ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయం కూడా వారి ప్రచారానికి కారణమని రోజా అన్నారు.  అయితే రోజా వ్యాఖ్యలను తప్పుపట్టిన కిర్రాక్ ఆర్పీ ఆమెకు దిమ్మదిరిగే రిటార్డ్ ఇచ్చాడు. రోజా ఏమన్నా గోప్ప స్టారా అంటూ.. జబర్దస్త్ కమేడియన్లతో పోలిస్తే ఆమె ప్రతిభ చాలా స్వల్పమని తీసి పారేశాడు.  ఆమెకు ఏమైనా ఆస్కార్ అవార్డులు వచ్చాయా? జాతీయ పరుస్కారాలు ఏమైనా తీసుకున్నారా?  అని ప్రశ్నించారు. గెటప్ శ్రీను, హైపర్, సుడిగాలి సుధీర్ వంటి  వంటి వారి టాలెంట్ తో పోలిస్తే ఆమె నటనా సామర్ధ్యం ఏపాటిదని ఎద్దేవా చేశాడు.   అంతే కాకుండా రాష్ట్రంలో ఓడిపోయే మొదటి సీటు రోజాదే అంటూ జోస్యం చెప్పాడు. ఆమెకు డిపాజిట్ దక్కితే గొప్పే అన్నాడు. మొత్తం మీద రోజా పిఠాపురంలో జనసేనానికి మద్దతుగా ప్రచారం చేసుకుంటూ తమ దోవన తాము వెడుతున్న జబర్దస్త్ కమేడియన్లను తక్కువ చేసి మాట్లాడి కెలుక్కున్నట్లైంది. కిర్రాక్ ఆర్పీ రిటార్డ్ తో ఆమెకు సౌండ్ లేకుండా పోయింది. ఇంత కాలం తన పట్ల ఎంతో గౌరవం ప్రదర్శించిన ఆర్పీలాంటి వారు  ఒక్కసారిగా రివర్స్ అవ్వడంతో కంగుతిన్నారు. ఆర్పీ రిటార్డ్ రోజా పరువును రాష్ట్ర వ్యాప్తంగా తీసేసినట్లైందని పరిశీలకులు సైతం అంటున్నారు. తన సొంత నియోజకవర్గం నగరిలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న రోజా అక్కడి ప్రచారాన్ని సజావుగా సాగించుకుని వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేసుకోకుండా జబర్దస్త్ కమేడియన్లను రెచ్చగొట్టి మరీ తిట్టించు కున్నట్లైం దంటు న్నారు.  
Publish Date: May 9, 2024 4:16PM

పోలవరంపై జగన్ మాటలు నీటి మూటలేనా? ఏం చెప్పారు, ఏం జరిగింది?

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమ‌రావ‌తిపై, పగబట్టినట్టుగానే పోలవరంపై కూడా పగబట్టారు. ఆ పనులను నిలిపివేయించారు. కాంట్రాక్టర్లను బెదిరించి పక్కకు తప్పించారు. రివర్స్ టెండర్లు అంటూ పెద్ద డ్రామా నడిపించి.. తమకు అత్యంత దగ్గరివారైన మేఘా కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారు. రివర్స్ టెండరింగ్ వ్యవహారం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు ఆదా చేశామంటూ మాయమాటలు వల్లించారు.  అప్పటి నుంచి పోలవరం పనులు పూర్తిగా పడకేశాయి.  చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పనుల్ని శ‌ర‌వేగంతో ప‌రుగెత్తించారు. ప్రతి సోమవారం.. పోలవారం అన్నట్టుగా ఆ ప్రాజెక్టు పనులు గురించి సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. అంత శ్రద్ధగా అధికారులను వెంటపడుతూ పనులు చేయించ‌డం వ‌ల్ల‌ ఆ ప్రాజెక్టు 75 శాతం వరకు పూర్తయింది. పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో, ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో కేంద్రమంత్రి గడ్కరీ  బ‌య‌ట‌పెట్టారు. ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రి గడ్కరీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటిదాకా 60 వేల కోట్లు విడుదల చేసినా జగన్ సర్కారు పూర్తిచేయకపోవడం చేతగానితనం అని విమర్శించారు. జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఏటా అనవసరంగా 1300 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని గ‌డ్క‌రీ చెప్పారు. పోల‌వ‌రం పూర్తి చేయడంలో జగన్ పూర్తిగా ఫెయిలైయ్యార‌ని,  వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు.. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని.. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ తోపాటు.. ఛత్తీస్‌ఘఢ్, ఒడిశా, తెలంగాణలో కూడా విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా.. 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదిలోకి మళ్లిస్తారు. ఇది పూర్తయ్యాక.. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాకుండా.. విశాఖ మహానగరం తాగునీటి అవసరాలు, దాని చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు తీరుస్తుంది. విద్యుదుత్పత్తి, జలరవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి.. చేపల పెంపకానికీ ఉపయోగపడుతుంది. వాస్తవానికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను చట్టం ప్రకారం.. కేంద్రమే అందించాలి.   పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో చిక్కుకున్న తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందిస్తే ఊళ్లు ఖాళీ చేస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. పునరావాస కాలనీలు పూర్తి చేయాలని అడుగుతున్నారు. దానికి కేంద్రమే నిధులు ఇవ్వాలి. సీఎం జగన్ 2022 లో చింతూరులో చెప్పిన విధంగా జరిగితే ప్లస్ 41 కాంటూరు పరిధిలో అందరికీ పరిహారం అందించాల్సి ఉంది. పునరావాస కాలనీలు పూర్తి చేసి వారిని తరలించాల్సి ఉంది.  తమ కోసం నిర్మిస్తున్నట్టు చెప్పిన పునరావాస కాలనీ సిద్ధం కాలేదు. సి.ఎం. జ‌గ‌న్ ఇచ్చిన హామీలు  ఆచరణ రూపం దాల్చకపోవడంతో నిర్వాసితులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. "ముఖ్యమంత్రి జ‌గ‌న్ మాటలు మాత్రమే మిగిలాయి. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కేంద్రం నాన్చుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేకపోతోంది. ఫలితంగా నిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల నిర్వాసితులు నష్టపోవాల్సి వస్తోంది. - ఎం.కె. ఫ‌జ‌ల్‌
Publish Date: May 9, 2024 3:38PM

ఫ్యాన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేందుకు ప్ర‌జ‌లు సిద్ధం! చింతమనేని ప్రభాకర్‌

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గాలలో దెందులూరు ఒకటి. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో దెందులూరు ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు.  ఈ  ఎన్నికలలో దెందులూరు ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అన్నదే ఆసక్తిగా మారింది.   ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాలే త‌ప్పా, ఇక్క‌డ  కొత్తగా వ‌చ్చిన ప్రాజెక్టులు ఏమీ లేవు. ప‌లు ప్రాంతాల్లో తాగు నీటి స‌మ‌స్య తీవ్రంగా ఉంది. డ్రైనేజ్‌లు, ర‌హ‌దారుల ప‌రిస్థితి దారుణంగానే వుంది. ఇవ‌న్నీ ఈ సారి ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌బోతున్నాయి.   దెందులూరు నియోజకవర్గం ఏలూరు చుట్టూ ఉంటుంది.  కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. పార్టీ ఏదైనా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు కమ్మ సామాజిక వర్గం నేతలే శాసనసభలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ జరగ్గా.. వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి సుమారు 16 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయననే మళ్లీ బరిలోకి దింపారు సీఎం జగన్‌. ఆయ‌న‌పై ఇసుక దందా సహా అనేక ఆరోపణలు వచ్చాయి.  ఎన్నికల్లో ఓడిపోగానే అబ్బయ్య చౌదరి మళ్లీ లండన్ వెళ్లిపోతారని టీడీపీ నేతలు ప్ర‌చారం చేస్తున్నారు. దెందులూరులో గెలుపు కోసం టీడీపీ ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ శ్రీలక్ష్మి శ్యామల చింతమనేని ప్రభాకర్ తరఫున ఇంటింటి ప్ర‌చారం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని తొలి రోజు నుంచి నిలదీసిన నేత చింతమనేని. వైసీపీ అక్రమాలకు అడ్డుగా ఉన్నాడనే అక్కసుతోనే చింతమనేని ప్రభాకర్‌పై అక్రమ కేసులు పెట్టారు. అక్రమంగా జైలుకు పంపారు. చివరికి చింతమనేని ప్రభాకర్‌పై హత్యాయత్నం కూడా చేశారు. ఆయనపై ఐదేళ్లలో వంద‌కు పైగా కేసులు పెట్టించారని శ్యామ‌ల ఆరోపించారు.  చింతమనేనిపై  నియోజకవర్గంలో సానుభూతి ఉంది. ప్రజల కోసం కష్టపడతారని.. ప్రభుత్వ పరమైనవి ఏమైనా అందరికీ అందేలా చూస్తారన్నన అభిప్రాయం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.  చింతమనేని విజయం ఖాయమని స్థానికులు అనుకుంటున్నారు.  ఈ సారి, లండన్ బాబును లండన్ పంపించి, తనకు ప్రజలు నలభై వేల మెజార్టీ ఇస్తారని నమ్మకంతో చింత‌మ‌నేని ఉన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.
Publish Date: May 9, 2024 3:33PM

జగన్ అకౌంట్లో ఇంకో దిక్కుమాలిన ఇంటర్వ్యూ

ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జగన్ చెబుతున్న అబద్ధాలు విని జనం చీదరించుకుంటున్నారు. వీటికంటే ఎక్కువ ఇరిటేషన్ కలిగిస్తున్న అంశం.. వివిధ మీడియా సంస్థలకు జగన్ ఇస్తున్న ఇంటర్వ్యూలు. మొన్నామధ్య ఒక నేషనల్ మీడియా సంస్థకు జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ పరమ చెత్త ఇంటర్వ్యూగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు వెకిలి నవ్వులతో సమాధానాలు దాటవేయడం, పరమ చెత్త ఇంగ్లీషు మాట్లాడ్డం, అర్థంపర్థం లేని ఎక్స్.ప్రెషన్లు ఇవ్వడం, ఆడపిల్లలా సిగ్గుపడిపోవడం, జాతీయ రాజకీయాల గురించి తనకు అంతగా ఐడియా లేదని అనడం... ఇవన్నీ చూసి దేశవ్యాప్తంగా జనం ఇలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రా జనం ఇన్నేళ్ళు ఎలా భరించార్రా బాబూ అనుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే పరిస్థితి. ఏ ప్రశ్న అడిగినా నాలుక చివర రెడీగా వున్న అబద్ధాలను చెప్పుకుంటూ వెళ్ళారు. జగన్ ఇస్తున్న ఇంటర్వ్యూల పరిస్థితి ఎలా వుందంటే, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి జీవితం మీద విరక్తి కలిగేలా పరిస్థితి తగలడింది. ఇలాంటి పరిస్థితిలో జగన్ మళ్ళీ ఒక తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పోనీ, తెలుగు మీడియా సంస్థ కదా, తెలుగులోనే మాట్టాడతాడు కదా ఇంటర్వ్యూలో కొంచెం క్లారిటీ వుంటుందేమో అనుకుంటే, అన్ని ఇంటర్వ్యూల కంటే నీచ నికృష్టంగా ఏడిచింది ఈ ఇంటర్వ్యూ.. ఇంగ్లీషు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో నసుగుతూ సమాధానాలు ఇచ్చిన జగన్ తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో అత్యంత మూర్ఖంగా సమాధానాలు ఇచ్చారు. జగన్ మూర్ఖుడని తెలుసుగానీ, మరీ ఇంత మూర్ఖ శిఖామణి అని తెలియదే అనేలా ఈ ఇంటర్వ్యూ సాగింది. అప్పులు తెచ్చి అందరికీ పంచడమే తప్ప అభివృద్ధి ఎక్కడ వుంది మహానుభావా అంటే, ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నాము కదా అని సమాధానం చెప్పారు. ఫిషింగ్ హార్బర్లు కడితే అభివృద్ధి ఎందుకు అవుతుంది అని అడిగితే, ఫిషింగ్ హార్బర్ వల్లే కోల్‌కతా కోల్‌కతా అయిందట, ఫిషింగ్ హార్బర్ వల్లే ముంబై ముంబై అయిందట. అందుకే వైజాగ్‌ని వైజాగ్ చేయడం కోసం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశారట. ఈయన రాకముందు వైజాగ్‌లో ఎవరూ ఫిషింగ్ చేయకుండా చెక్కభజన చేస్తూ వుండేవారు.. ఈయన వచ్చాక అక్కడ జనానికి చేపలు పట్టడం నేర్పారు..  పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకేం ప్రాబ్లం.. అది ఆయన వ్యక్తిగత విషయం, చట్టబద్ధమైన విషయం ఆ విషయం మీరు మాటమాటకీ ఎందుకు ప్రస్తావిస్తారు. ఆ పాయింట్ మీద పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి ఓటు వేయొద్దని అనడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే, జగన్ మరీ మూర్ఖంగా ఆ పాయింట్ మీదే పవన్ కళ్యాణ్‌కి ఓటు వేయొద్దని అంటాను అని మొండిగా వాదించారు. ఈ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన అనేక వితండవాద సమాధానాలు ఆక్ ఈజ్ పాక్ పాక్ ఈజ్ ఆక్.. ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టుగా ఏడిచాయి.  బాబాయ్ హత్య గురించి ప్రశ్నిస్తే అది దిక్కుమాలిన ఎక్స్.ప్రెషన్తో సంబంధం లేని సమాధానాలు. ఈ ఐదేళ్ళలో హంతకుడిని ఎందుకు పట్టుకోలేదు మగడా అంటే, బాబాయ్‌కి రెండో పెళ్ళి అయింది.. కొడుకు కూడా వున్నాడు.. ఇదీ జగన్ సమాధానం. బాబాయ్ హత్య గురించి టీవీలో అవినాష్ రెడ్డి మాట్లాడింది విని ఈయనకి అవినాషే మంచోడు అనిపించిందట. అందుకే అవినాష్‌కి మద్దతుగా నిలిచాడట. ఇలాంటి  ఆణిముత్యాలు జగన్ ఇంటర్వ్యూలో చాలా వున్నాయి. మొత్తమ్మీద జగన్ అకౌంట్లో మరో దిక్కుమాలిన ఇంటర్వ్యూ చేరింది.
Publish Date: May 9, 2024 2:11PM

జనం సొమ్ముతో జల్సాలు.. జగన్ ప్యాలెస్ లో బంగారంతో చేసిన కుర్చీలు!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఒక్క‌సారికూడా మీడియా ముందుకు రాలేదు. తెలుగు మీడియా అంటే ఆయ‌న‌కు చిరాకు కాబోలు.. ఛీఛీ నేనా..  తెలుగు మీడియాతో మాట్లాడ‌ట‌మా అన్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయినా నిత్యం కాక‌పోయినా  తరచుగా మీడియా స‌మావేశాలు ఏర్పాటుచేసి ప్ర‌భుత్వ విధానాలు, అభివృద్ధి,  సంక్షేమ ప‌థ‌కాల‌పై వివ‌రిస్తుంటారు. కానీ  జ‌గ‌న్ మాత్రం త‌న ఐదేళ్ల పాల‌న‌లో ఒక్క‌సారంటే ఒక్క‌సారి కూడా మీడియా ముందుకు రాలేదు. తెలుగు మీడియా అంటే చిన్న‌చూపు   అన్నది పక్కన పెడితే.. మీడియా వాళ్లు ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతారోన‌న్న భ‌యం ఆయనను  తెలుగు మీడియా దూరంగా ఉంచడానికి కారణమని వైసీపీ నేతలే చెబుతుంటారు.  తాజాగా ఎన్నిక‌ల వేళ తప్పనిసరి పరిస్థితులలో  జ‌గ‌న్ ఓ తెలుగు ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. జగన్ ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి జ‌గ‌న్ కు ఇబ్బంది క‌లిగించే ప్ర‌శ్న‌ ఒక్కటి కూడా వేయకుండా  చాలా జాగ్రత్త పడ్డాడు.  జ‌గ‌న్ స‌మాధానం చెప్ప‌గ‌లిగే ప్ర‌శ్న‌ల‌తోనే ఆ ఇంట‌ర్వ్యూ సాగింది. ఇంట‌ర్వ్యూ జ‌రిగిన విధానం అలా  ఉంచితే.. ఇ ఇంట‌ర్వ్యూ సందర్భంగా జ‌గ‌న్ , స‌ద‌రు టీవీ ఛానెల్ ప్ర‌తినిధి కూర్చున్న కుర్చీలు ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.   తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్యాలెస్‌లోనే ఇంట‌ర్వ్యూ జరిగిందని అంటున్నారు. ఈ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, టీవీ ఛానెల్ ప్ర‌తినిధి కూర్చున్న కుర్చీల‌ను చూసి తెలుగు ప్ర‌జ‌లు ముక్కున వేలేసుకుంటున్నారు. జ‌గ‌న్ ధ‌న‌వంతుడ‌ని అంద‌రికీ తెలుసు.. దేశంలోని రాష్ట్రాల సీఎంల‌లో అత్యంత ధ‌న‌వంతుడు జ‌గ‌న్ అని జాతీయ మీడియాలోనూ గతంలోనే క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, జ‌గ‌న్ వ‌ద్ద సొమ్మంతా అవినీతి, అక్ర‌మాల‌తో, దొడ్డిదారిన సంపాదించిందేన‌న్న విమర్శలూ ఉన్నాయి. అక్రమాస్తుల కేసులోనే  జ‌గ‌న్ జైలుకు సైతం వెళ్లొచ్చారు. ల‌క్ష‌ల కోట్లు సంపాద‌న క‌లిగిన వారి ఇళ్ల‌లోనైనా బంగారం పూత‌తోచేసిన కుర్చీలు చాలా అరుదు. రాజుల కాలంలో బంగారం పూత‌తో కూడిన‌ కుర్చీలు ఉండేవ‌ని పుస్త‌కాల్లో చ‌దువుకోవ‌ట‌మే త‌ప్ప వాటిని చూసిన దాఖ‌లాలు లేవు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కుర్చీలకు, బంగారపు తొడుగు వేసిన సింహాలు క‌నిపించాయి. వీటిని చూసిన తెలుగు ప్ర‌జ‌లు షాక్ అవుతున్నారు. ఒక్కో కుర్చీకి రెండు బంగార‌పు సింహాలు ఉన్నాయి. దాదాపు ఒక్కో సింహం కేజీ బంగారంతో చేసిన‌ట్లు తెలుస్తోంది. జగన్ అవినీతి సొమ్ముతో తన ఇంట్లో బంగారపు కుర్చీలు చేయించుకున్నారని  ఆయ‌న చెల్లెలు వైఎస్‌ షర్మిల ఇటీవ‌లి కాలంలో  చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఆమె మాటలను జనం న‌మ్మ‌లేదు. ప్ర‌స్తుతం బంగారం కుర్చీల‌కు సంబంధించిన ఫోటోలు బయట పడటంతో అందరూ షాక్ అవుతున్నారు.   ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాష్ట్రంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలోనే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు అక్ర‌మంగా సంపాదించార‌న్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఏపీ సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి రాష్ట్రాన్ని దోచుకోవ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఇసుక‌, మ‌ట్టి మాఫియాతోపాటు, గంజాయి అక్ర‌మ ర‌వాణా, మ‌ద్యం మాఫియాతో జ‌గ‌న్, ఆయ‌న అనుచ‌రులు ల‌క్ష‌ల కోట్లు ప్ర‌జ‌ల సొమ్మును జేబులో వేసుకున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.  తాజాగా లాండ్ టైట్లింగ్  యాక్ట్ తో ప్ర‌జ‌ల సొమ్మును త‌న సొమ్ముగా మార్చుకునేందుకు జ‌గ‌న్ కుట్ర చేశారని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇక ప్ర‌జా సొమ్ముతో ప్ర‌ముఖ న‌గ‌రాల్లో విలాస‌వంత‌మైన భ‌వ‌నాలు, ఆ భ‌వ‌నాల్లో బంగార‌పు కుర్చీలు చేయించుకుంటున్న జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో నేను, నా అభ్య‌ర్థులు పేద‌వాళ్లం, డ‌బ్బు లేదు.. అప్పుల్లో ఉన్నారంటూ బ‌హిరంగంగా ఎలా చెప్పగలుగుతున్నారని జనం విస్తుపోతున్నారు.   మ‌రోవైపు దేశంలోనే ధ‌నిక ముఖ్య‌మంత్రుల్లో ఒక‌రైన  జ‌గ‌న్.. ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో మాత్రం.. ఈ ఎన్నిక‌లు పేద‌ల‌కు, ధ‌నికుల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.   ప్ర‌జ‌లంతా పిచ్చోళ్లు.. తాను ఏది చెప్పినా వింటారు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో  డ‌బ్బులు పంచేస్తే ఓట్లు వేస్తార‌ని జ‌గ‌న్, వైసీపీ నేత‌లు ఫిక్స్ అయిన‌ట్లు క‌నిపిస్తున్నది.  ప్ర‌జ‌ల ప‌ట్ల‌ జ‌గ‌న్‌, వైసీపీ అభ్య‌ర్థుల దుర్మార్గ‌పు ఆలోచ‌న‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలివేయాలంటే మే13న జ‌రిగే పోలింగ్ లో ఓటును ఆయుధంగా మార్చాల్సిందే. ఇప్ప‌టికే   ఏపీలోని మెజార్టీ ప్ర‌జ‌లు.. ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం తెలుగుదేశం కూటమికి పోటెత్తుతున్న జనాలను, డజనుకు పైగా సర్వేల ఫలితాలను చూస్తే అర్ధమైపోతుంది. 
Publish Date: May 9, 2024 1:43PM

కొట్టు సత్యనారాయణని తరిమికొట్టిన ఉద్యోగులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎవరో తెలుసా? చెప్పలేరు.. ఎందుకంటే జగన్ మంత్రివర్గంలో ఉనికి, గుర్తింపు లేని అనేకమంది మంత్రులలో ఆయన కూడా ఒకరు. కొట్టు సత్యనారాయణ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవినీతి, అక్రమ సంపాదన విషయంలో అగ్రనేతకే పాఠాలు చెప్పగల స్థాయికి చేరుకున్న కొట్టు సత్యనారాయణ ఈసారి ఎన్నికలలో కన్ఫమ్‌గా ఓడిపోయే ఎమ్మెల్యేలలో ఒకరు. గురువారం నాడు తాడేపల్లిగూడెంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఇంతలో కొట్టు సత్యనారాయణ అక్కడకి వచ్చారు. పోలింగ్ బూత్ దగ్గరకి వెళ్ళే ప్రయత్నం చేశారు. దాంతో ఉద్యోగులు ఆయన్ని ఆపారు. ఒక అభ్యర్థి అయిన మీరు ఇక్కడకి రావడం కరెక్ట్ కాదన్నారు. దాంతో కొట్టు సత్యనారాయణ అహం దెబ్బతింది ‘అందర్నీ లోపల వేయించేస్తాను’ అని నోరు జారారు. దాంతో ఉద్యోగులు ఒక్కసారిగా కొట్టు సత్యనారాయణ మీద విరుచుకుపడ్డారు. దాంతో కొట్టు సత్యనారాయణ అక్కడ నుంచి బయటకి వచ్చేశారు. బయటకి వచ్చిన కొట్టుకు ఏం మాట్లాడాలో అర్థం కాక, అక్కడే వున్న హిందీ పోలీసులతో ‘మై హిందీ బాత్ కర్తాహూ’ అని వచ్చీ రాని పిచ్చి హిందీ మాట్లాడారు. అక్కడ నుంచి వెళ్ళిపోకుండా అక్కడే వున్న కొట్టు మీద ఉద్యోగులు విరుచుకుపడ్డారు. ‘లోపల వేయిస్తావా.. మీ పని అయిపోయింది.. పో ఇక్కడ నుంచి అని కసిరారు’ దాంతో చెమటలు పట్టిన కొట్టు సత్యనారాయణ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. మొత్తమ్మీద కొట్టు సత్యనారాయణ అదృష్టవంతుడు అని చెప్పాలి. ఎందుకంటే, ఆగ్రహంగా వున్న ఉద్యోగుల చేత కొట్టించుకోకుండా బయటపడ్డారు.
Publish Date: May 9, 2024 12:52PM

ఓట‌రా మేలుకో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని కాపాడుకో!

అభివృద్ధి జ‌ర‌గాలంటే ఆయుధం ఓటు.. ప్ర‌జా పాల‌న సాగాలంటే ఆయుధం ఓటు.. అవినీతి ప్ర‌భుత్వాల‌ను కుప్ప కూల్చాలంటే ఆయుధం ఓటు.. క‌క్ష‌పూరిత పాల‌న సాగిస్తున్న ప్ర‌భుత్వం మెడ‌లు వంచాల‌న్నా ఆయుధం ఓటే.. మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు బాగుండాలంటే ఆయుధం ఓటు.. ఆ ఆయుధం మ‌న చేతుల్లోనే ఉంది. మన‌ది ఒక్క ఓటే క‌దా వెయ్య‌క‌పోతే ఏమ‌వుతుందిలే అనుకుంటే అది పొర‌పాటే. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఓట‌ర్లు చేసిన ఆ పొర‌పాటే ఇప్పుడు వారి జీవితాల‌కు శాపంగా మారింది. రాజ‌ధాని లేని రాష్ట్రంగా చెడ్డ‌పేరు మూట‌గ‌ట్టుకోవ‌డంతోపాటు.. గంజాయికి నిల‌యంగా మారింది. క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఏపీ మారింది, అభివృద్ధి లేని రాష్ట్రంగా, ఉద్యోగాలు లేని రాష్ట్రంగా, ఉన్న కంపెనీల‌ను త‌రిమేసిన రాష్ట్రంగా.. మొత్తంగా మ‌రో శ్రీ‌ల‌కం దేశంగా మారేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం సిద్ధంగా ఉంది. అందుకు కార‌ణం ఏపీ ఓట‌ర్ల నిర్ల‌క్ష్య‌మే. ఏపీలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్ర భ‌విష్య‌త్తు అంధ‌కారంగా మారింది. అభివృద్ధి లేదు, రోడ్లు వేయ‌లేదు, ఉద్యోగాలు క‌ల్పించ‌లేదు, క‌నీస సౌక‌ర్యాలు లేవు.. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై దాడులు మాత్రం పెద్దెత్తున జ‌రిగాయి. గొంతెత్తి అడిగిన వారు  జైళ్ల‌కు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నిక‌ల్లో 79.64 శాతం పోలింగ్‌ న‌మోదైంది. దాదాపు 20శాతం మంది ఓట‌ర్లు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. వీరిలో 10శాతం మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ముందుకు వ‌చ్చినా ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ఇన్ని ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుండేవారు కాక‌పోవ‌చ్చు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డం, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాలకే ప‌రిమితం కావ‌డంతో   రాష్ట్రంలో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారి జీవ‌నోపాధి కోసం   చిన్న‌ాచితికా ప‌నులు కూడా దొర‌క‌క పోవ‌డంతో హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు రాష్ట్రాల‌కు పెద్ద సంఖ్య‌లో   వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇత‌ర రాష్ట్రాల్లో జీవ‌నం సాగిస్తున్న ఏపీ ఓట‌ర్లు.. సొంత రాష్ట్రం వెళ్లి ఓటువేసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌లేదు. ఫ‌లితంగా ఓటింగ్ శాతం త‌గ్గింది. దాదాపు 60 నుంచి 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో వెయ్యి నుంచి 10వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్య‌ర్ధులు ఓడిపోయిన ప‌రిస్థితి. ఇత‌ర ప్రాంతాల‌కు ఉపాధికోసం వెళ్లిన‌ ఏపీ ఓట‌ర్లు ఆశించిన స్థాయిలో త‌మ రాష్ట్రంకు వెళ్లి ఓటు వేయ‌క‌పోవ‌డంవ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గ‌త ఐదేళ్ల‌లో పీక‌ల్లోతు అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది.   గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి 151 సీట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ స‌గానికి పైగా స్వ‌ల్ప ఓట్ల మెజార్టీతో గెలిచిన సీట్లే. 20శాతం మంది ఓట‌ర్ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల వైసీపీ అధికారంలోకి రావ‌డం.. ఏపీ ప్ర‌జ‌లు ఉపాధి కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్ది రోజుల‌కే పేద‌ల‌కు అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిలో వేగంగా జ‌రుగుతున్న ప‌నుల‌ను నిలిపివేశారు.   ఏపీ సీఎంగా చంద్ర‌బాబు కొన‌సాగిన‌ స‌మ‌యంలో అమ‌రావ‌తి, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి దొరికింది. రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతున్న స‌మ‌యంలో కుల‌వృత్తుల వారికి పుష్క‌లంగా ప‌నులు దొర‌క‌డంతో ఆర్థికంగా వారికి వెసులుబాటు ఏర్ప‌డింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌క్ర‌బుద్ధితో వారి జీవ‌నోపాధిపై దెబ్బ‌కొట్టారు. అంతేకాదు.. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ఏపీ అభివృద్ధిలో పూర్తిగా వెనుక‌బ‌డి పోయింది. చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో ప‌లు ప్ర‌ముఖ కంపెనీలు పెద్దెత్తున పెట్టుబ‌డులు పెట్టాయి. జ‌గ‌న్ సీఎం హోదాలో వాట‌న్నింటిని ఏపీ నుంచి త‌రిమేశారు. అలాఅని కొత్త కంపెనీల‌నుకూడా ఏపీకి తీసుకురాలేదు. దీంతో యువ‌త ఉద్యోగాలు చేసుకునేందుకు అవ‌కాశం లేకుండా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేశారు. మ‌ట్టి, ఇసుక దోపిడీతో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు జేబులు నింపుకున్నారు. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డం, అక్ర‌మ కేసులు బ‌నాయించి చిత్ర హింస‌ల‌కు గురిచేశారు. వైసీపీ నేత‌ల ఆగ‌డాలు త‌ట్టుకోలేక పోయిన చాలా మంది ఏపీని వ‌దిలి జీవ‌నోపాధికోసం ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్లిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనంత‌టికీ కార‌ణం.. ఇత‌ర రాష్ట్రాల్లోని ఏపీ ఓట్లు పోలింగ్ స‌మ‌యంలో ఓటు హ‌క్కు వినియోగించుకోక పోవ‌టం వ‌ల్ల‌నేని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.  2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా క‌లిసి పోటీచేసి అధికారంలోకి వ‌చ్చాయి. 2014 నుంచి ఐదేళ్లు ఏపీలో ఎటుచూసినా అభివృద్ధి ఆన‌వాళ్లు క‌నిపించాయి. సీఎంగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టుద‌ల‌తో ఏపీని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న ప్ర‌ముఖ కంపెనీల‌ను ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా చేయ‌డం, పాత రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు, కొత్త రోడ్లు వేయ‌డం, యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌న‌, ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధానిని అద్భుతంగా నిర్మించేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. చంద్ర‌బాబు హ‌యాలో ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఆర్థికంగా అన్ని వ‌న‌రులుఉన్న‌ తెలంగాణ రాష్ట్రంతో పోటీప‌డింది. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అబివృద్ధి అనే ప‌దాన్ని మ‌ర్చిపోయి కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో పాల‌న సాగించి ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైకో పాల‌న‌తో ఐదేళ్లు న‌ర‌క‌యాత‌నకుగురైన ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌స్తుతం ఆ బారినుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం వ‌చ్చింది. ఓటు ద్వారా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బుద్దిచెప్పి మ‌ళ్లీ ప్ర‌జాపాల‌నను తెచ్చుకొనే అవ‌కాశం ఏపీ ప్ర‌జ‌ల‌కు వ‌చ్చింది. మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. రాష్ట్రంలోఉన్న ఓట‌ర్లు, ఇత‌ర రాష్ట్రాల్లోఉన్న ఏపీ ఓట‌ర్లు  పోలింగ్ రోజు ఏపీలోని వారి స్వంత ప్రాంతాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని. ఐదేళ్ల జగన్ దుర్మార్గ‌  పాల‌నకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది.   జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఓటు   ఆయుధంతో బుద్ధి చెప్పాలి.   నిర్ల‌క్ష్యం వీడి మేలుకో ఏపీ ఓటరా.. మ‌ళ్లీ ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు ఓటును ఆయుధంగా వినియోగించుకో.
Publish Date: May 9, 2024 12:25PM

ఫ్లాష్ న్యూస్... డిప్రెషన్లో జగన్.. సైకో థెరఫీ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణరంగంలో ఎన్టీయే కూటమి పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మూడు రోజుల్లో ప్రచార గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో కూటమి పార్టీలన్నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ ప్రచారంలో దుమ్ము దులిపేస్తూ, జగనన్న మీద దుమ్మెత్తి పోస్తున్నారు.  ప్రతిపక్షాలు ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేస్తుంటే, అధికార పార్టీ నాయకుడు, అంగబలం, అర్థబలం వున్న నాయకుడు జగన్ మాత్రం తాడేపల్లి కోటను దాటికి బయటకి రావడం లేదు. చాలామంది అనుకుంటున్నది ఏమిటంటే, ఓటమి చెందబోతున్నానని అర్థం చేసుకున్న జగన్ ఇక ప్రచారం చేయడం ఎందుకులే అని చేతులెత్తేశాడని, ఎన్నికలు ముగిసిన తర్వాత లండన్ వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని... అయితే తాడేపల్లి కోటకు సంబంధించిన వర్గాలు చెబుతున్నది వేరేలాగా వుంది. జగన్ ఇప్పుడు పూర్తిస్థాయి డిప్రెషన్లో కూరుకుపోయి వున్నారట. ఓటమి తప్పదని తెలిసిన తర్వాత ఆ డిప్రెషన్ మరింతగా పెరిగిపోయిందట. మొన్న మచిలీపట్నం సభలో గొంతు వణికేలా ప్రసంగించిన జగన్, కేవలం ఫిజికల్‌గా ఏడవలేదంతే, దాదాపు ఏడ్చినంత పనిచేశారు. ఆ మీటింగ్ తర్వాత జగన్ మానసిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందట. తాను ఇన్ని బటన్లు నొక్కినా, జనం ఎన్నికలలో తన ఫ్యాన్ గుర్తు బటన్ నొక్కడానికి ఇష్టపడటం లేదని అర్థం చేసుకున్న ఆయన భారీ స్థాయిలో హర్టయ్యారట. ఐదేళ్ళ నుంచి తాను వేసిన ప్లాన్ ఇలా అట్లర్ ఫ్లాప్ కావడం, ఓటమి తర్వాత తాను జైలుకు వెళ్ళడం తప్ప మరొక మార్గం లేకపోవడంతో జగన్ భారీ స్థాయిలో డిప్రెషన్లో కూరుకుపోయాడని తెలుస్తోంది. గత ఎన్నికలలో ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల, ఇంకోవైపు విజయమ్మ, మరోవైపు అంతర్లీనంగా బ్రదర్ అనిల్ కుమార్... ఇలా చాలామంది జగన్‌కి మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు తాను పూర్తిగా ఒంటరి అయిపోవడం, పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా మారడం, జనం మూడ్ పూర్తిగా అవతగం కావడంతో జగన్ డిప్రెషన్ లోయలోకి పడిపోయారని తెలుస్తోంది. ఆయన్ని డిప్రెషన్ నుంచి బయటకి తీసుకురావడానికి ప్రస్తుతం ఆయనకు సైకాలజిస్టుల చేత సైకో థెరఫీ జరుగుతోందని చెబుతున్నారు. డిప్రెషన్ తగ్గడానికి పవర్ ఫుల్ మందులు కూడా వాడుతున్నారని సమాచారం. ఆ ‘సైకో’ థెరపీ, డిప్రెషన్ మందుల సహకారంతో ప్రస్తుతం జగన్ బండి నడుస్తున్నట్టు తెలుస్తోంది.
Publish Date: May 9, 2024 12:13PM