బోల్తా పడిన ఓల్వో బస్సు... జనం సురక్షితం

 

ఓల్వో బస్సులు బోల్తా పడటం మామూలైపోయింది. బుధవారం నాడు మహబూబ్నగర్ జిల్లా దన్వాడ మండలం యేలిగండ్ల వద్ద ఓ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడలేదు. అదే రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులను రక్షించారు. ఈ వోల్వో బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్ నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా చేసిన అతివేగ డ్రైవింగే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి చేరుకుని వోల్వో బస్సును రోడ్డు మీద నుంచి పక్కకు తప్పించారు. ప్రయాణికులు మరో బస్సులో గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu