Latest News
బోల్తా పడిన ఓల్వో బస్సు... జనం సురక్షితం
posted on: Oct 15, 2014 11:18AM

ఓల్వో బస్సులు బోల్తా పడటం మామూలైపోయింది. బుధవారం నాడు మహబూబ్నగర్ జిల్లా దన్వాడ మండలం యేలిగండ్ల వద్ద ఓ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడలేదు. అదే రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులను రక్షించారు. ఈ వోల్వో బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్ నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా చేసిన అతివేగ డ్రైవింగే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి చేరుకుని వోల్వో బస్సును రోడ్డు మీద నుంచి పక్కకు తప్పించారు. ప్రయాణికులు మరో బస్సులో గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు.






