ఓటేసి సెల్ఫీ... సుప్రియా సూలే

 

ఈమధ్యకాలంలో ప్రతి సందర్భంలోనూ సెల్ఫీ తీసుకోవడం మామూలైపోయింది. మహారాష్ట్ర దిగ్గజం శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఓటేసిన తర్వాత కూడా సెల్ఫీ తీసుకుని తన ప్రత్యేకతను చాటారు. ఇదిలా వుంటే, మహారాష్ట్రలో పోలింగ్ చురుగ్గా జరుగుతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, బీజేపీ ప్రధాన అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవిస్.. ఇలా పలువురు ప్రముఖులు ఉదయాన్నే ఓటుహక్కు వినియోగించుకున్నారు. సుప్రియ తాను ఓటు వేయడమే కాక.. బయటకు వచ్చిన తర్వాత వేలికి ఇంకు గుర్తు చూపిస్తూ మరికొందరు మహిళా నేతలతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu