కాల్ మనీ..బుద్దా వెంకన్న సోదరుడు అరెస్ట్..

విజయవాడ కాల్ మనీ దందాపై ఇప్పటికే ఎంతో మంది వడ్డీ వ్యాపారులు, కార్యలయ్యాల్లో పోలీసులు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ తనిఖీల్లో విలువైన పత్రాలు, ప్రామిసరీ నోట్లు..స్వాధీనం చేసుకున్నారు.ఇప్పటికే కాల్ మనీ దందాకి సంబంధం ఉందని ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వర్రావును అరెస్ట్ చేశారు పోలీసులు.బుద్ధా నాగేశ్వర్రావు ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు..కోట్లు విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.