Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీఆర్ఎస్ మైండ్ గేమ్.. గుణపాఠం తప్పదు.. ఉత్తమ్
posted on: Dec 9, 2015 10:54AM

టీ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వికృత రాజకీయాలు చేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఎక్కువకాలం కొనసాగదు.. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు..ఏదో ఒక సమయంలో గుణపాఠం తప్పదు అని వ్యాఖ్యనించారు. అంతేకాదు ఇతర పార్టీనేతలకు పదవులు ఆశ చూపించి.. ఆపర్ ఆకర్ష్ ద్వారా నేతలను ఆకర్షించి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బలం లేకపోయినా ఎమ్మేల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఎద్దేవ చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సెటిలర్స్కు రక్షణ కల్పించేది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని..హైదరాబాద్ పరిధిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు.






