TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉదయ్ కిరణ్ మృతదేహం..ఎవరూ రాలేదు!

Published on: Mon Jan 6, 2014 4:27PM

 

 

 

ఉదయ్ కిరణ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని నిమ్స్ మార్చరీకి తరలించారు. అయితే మొదట పోస్టుమార్టం పూర్తి కాగానే ఉదయ్ పార్థివ దేహాన్ని తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో అనాథ శవంలా బయట అరగంట పాటు ఉంది. ఉదయ్ భార్య తరఫున గానీ, ఉదయ్ తరఫు బందువులు ఎవరూ రాలేదు. ఉదయ్‌ను చివరి సారిగా చూసేందుకు వచ్చిన అభిమానులు ఆవేదన చెందుతూ ఆస్పత్రి సబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉదయ్ మృత దేహాన్ని మార్చురిలో పెట్టారు. ఉదయ్ కిరణ్ సోదరి విదేశాల నుంచి రావాల్సి ఉండంతో అతని అంత్యక్రియలు మంగళవారం జరగనున్నట్లు తెలుస్తోంది.