చీపురు పట్టుకుంటా... సానియా

 

స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా రిలయన్స్ గ్రూపు అధినేత అనీల్ అంబానీ బుధవారం నాడు మోడీ పిలుపు మేరకు అనిల్ బుధవారం తన స్నేహితులతో కలిసి ముంబయి చర్చి గేట్ ముందు పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా మరో తొమ్మిదిమంది భారతీయ ప్రముఖులకు సవాల్ విసిరారు. వాళ్ళలో సానియా మీర్జా కూడా వున్నారు. రిలయన్స్ అధినేత అనీల్ అంబానీ తనకు చేసిన సవాల్ స్వీకరించిన టెన్నిస్ స్టార్ చీపురు పట్టి రోడ్లు ఊడ్చనున్నారు. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ అనీల్ అంబానీ చాలెంజ్ను స్వీకరిస్తున్నానని, వీలు చూసుకుని డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్కు వెళ్లేలోపు స్వచ్ఛ భారత్లో పాల్గొంటానని సానియా తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu