సుష్మా స్వరాజ్‌ కి కిడ్నీ ఆపరేషన్...


విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ గత కొద్ది కాలంగా కిడ్ని సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. దీనిలోభాగంగానే ఆమెకు కిడ్నీ ట్రాన్స్‌ప్రాంటేషన్ సర్జరీ చేస్తున్నారు. కిడ్నీ దాతలు ఆమెకు ఇవాళ దొరకడంతో ఆమెకు శస్స్రచికిత్స నిర్వహిస్తున్నారు. నవంబర్ 7న కిడ్నీ ఫెయిల్‌తో ఆమె ఎయిమ్స్‌లో చేరినట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆమె కిడ్నీని కాపాడేందుకు ప్రతీరోజు డయాలిసస్ ద్వారా చికిత్స అందిస్తున్నారు.