జగన్ వారికి చిల్లిగవ్వ ఇవ్వలేదు

 

టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ఆస్తులను కొల్లగొట్టారని విమర్శించారు. తన కంపెనీలకు పెట్టుబడి పెట్టిన వారికి చిల్లిగవ్వకూడా జగన్ ఇవ్వలేదని ఎద్దేవ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అనువైన ప్రదేశాల ఎంపికలో ఏపీ రెండవ స్థానంలో నిలిచిన నేపథ్యంలో ఈ సందర్బంగా ఆయన పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం చాలా సంతోషకరమైన వార్త అని అన్నారు. రాష్ట్రం విడిపోయి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఏపీకి ఇలాంటి అరుదైన ఘనత దక్కడం చాలా అభినందనీయమని అన్నారు. చంద్రబాబు కూడా ఏపీ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నారని.. అవినీతి పేరిట వైఎస్ లూటీ చేసిన డబ్బును ప్రజలకు అప్పగిస్తే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని సోమిరెడ్డి విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News