రేవంత్ రెడ్డిని చూడాలని ఉంది


 

నల్గొండ జిల్లా చంద్రపేట మండలంలోని ఓ భూమి వివాదంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు.. టీడీపీ నే తకు చందూలాల్ మధ్య వివాదం జరిగింది. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు చందూలాల్ పై దాడి చేయగా ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చందూలాల్ ను హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే చందూలాల్ తనకు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చూడాలనిపిస్తుందని కోరడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తాను వస్తున్నట్లుగా చందూలాల్ కుటుంబ సబ్యులకు ఫోన్ చేసి చెప్పారు. తాను వెంటనే బయలుదేరి వస్తున్నానని.. ధైర్యంగా ఉండమని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా రేవంత్, ఇతర టిడిపి నేతలు ఉదయం చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu