TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సండ్రకి రెండువారాలు రిమాండ్

Published on: Tue Jul 7, 2015 3:32PM

 

ఈరోజు ఉదయం నుండి తెదేపా ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్యకి ఎసిబి కోర్టు రిమాండ్ విదిస్తుందా లేదా? అనే అనుమానం ఎసిబి అధికారులలో సైతం నెలకొంది. ఎందుకంటే ఆయన తరపున వాదించిన లాయర్ ప్రజా ప్రతినిధి అయిన సండ్రను అరెస్ట్ చేసే ముందు స్పీకర్ నుండి ముందుగా అనుమతి తీసుకోలేదని వాదించడంతో కోర్టు కూడా కొంచెం సమయం తీసుకొన్న తరువాతనే తన నిర్ణయం ప్రకటించింది. ఆయనకీ రెండు వారల పాటు అంటే జూలై 21వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. కానీ లాయర్ ప్రజా ప్రతినిధి అయిన సండ్రను జైలు అధికారులు ప్రత్యేక ఖైదీగా చూడాలని ఆదేశించింది. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనని చర్లపల్లి జైలుకి తరలిస్తున్నారు. ఆయన తరపున వాదించిన లాయర్లు కోర్టులో బెయిల్ పిటిషన్ వేసేందుకు సిద్దమవుతుంటే, ఆయనను ప్రశ్నించేందుకు ఐదు రోజులపాటు కస్టడీ కోరుతూ పిటిషన్ వేయబోతున్నారు.