పాలేరు ఉపఎన్నిక.. టీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి...

 

కాంగ్రేస్ పార్టీ పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఉపఎన్నిక ఖరారై సంగతి తెలిసిందే. అయితే ఈ ఉపఎన్నికకు టీఆర్ఎస్ నుండి తుమ్మల నాగేశ్వరరావు బరిలో దిగుతుండగా.. కాంగ్రెస్ నుండి సుచరిత రెడ్డి బరిలో దిగుతున్నారు. టీడీపీ మాత్రం ఈ ఉపఎన్నికకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు తెలంగాణ టీడీపీపై సెటైర్లు వేస్తున్నారు. ఎలాగూ పోటీ చేసినా కానీ ఓడిపోతుందనే ఎన్నికలో పోటీ చేయడంలేదని.. నారాయణఖేడ్ ఎన్నికల్లో పాల్గొన్న టీడీపీ ఇప్పుడు పాలేరు ఎన్నికల సమయంలో మాత్రం.. గెలిచే సత్తా లేక పోటీ నుండి తప్పుకుంటుందని మంత్రులు హరీష్ రావు, కెటి రామారావు, తుమ్మల నాగేశ్వర రావులతో పాటు పలువురు నేతలు కూడా ఎద్దేవ చేస్తున్నారు. అయితే వీరికి తెలంగాణ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కాస్త గట్టిగానే సమాధానం చెబుతున్నారు. గతంలో నారాయణఖేడ్ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ మమ్మల్ని సంప్రదించలేదు.. ఇప్పుడు సంప్రదించింది అని అన్నారు. అంతేకాదు సుచరిత రెడ్డిగారు అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నా టీఆర్ఎస్ కనీసం ఆమె కలిసే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. మరి రేవంత్ రెడ్డి సమాధానాలకు టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుండో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu