రేవంత్ బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా

 

నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. మొన్న జరిగిన రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణలో కోర్టు ఈరోజు కౌంటర్ దాఖలు చేయమని ఏసీబీ అధికారులను ఆదేశించింది. అయితే ఈ పిటిషన్ పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్ పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు రేవంత్ రెడ్డికి కనీస సౌకర్యాలు కల్పించట్లేదని అతని తరపు న్యాయవాది పిటిషన్ వేయగా ఏసీబీ అధికారులు దీనికి స్పందించి ఆయనకు అన్ని సౌకర్యాలు అందిస్తున్నామని నివేదికను సమర్పించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu