వెస్టిండీస్ తో రెండో వన్డేకు 'వర్షం' దెబ్బ

 

rain threat to second ODI, India vs West Indies, India cricket, West Indies

 

 

భారత్, వెస్టిండీస్ మధ్య రేపు విశాఖపట్నంలో జరగనున్న రెండో వన్డే కు వర్షం ఆటంకంగా మారె అవకాశం ఉంది. రెండు రోజులుగా విశాఖలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మైదానం మొత్తం నీటితో నిండివుంది. అత్యాధునిక డ్రైనేజ్ విధానం కలిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో మ్యాచ్ ఆరంభానికి కనీసం ఆరు గంటలకు ముందు వర్షం నిలిచిపోతే మ్యాచ్ నిర్వాహణకు ఎటువంటి ఆటంకం ఉండదని ఎసిఎ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి మ్యాచ్ సాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సాయంత్రం ప్రాక్టీస్‌కు మైదానం అనుకూలిస్తుందని భావిస్తున్నారు. రెండో వన్డే మ్యాచ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఇరు దేశాల జట్లు శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నాయి.