శభాష్ బాబూ.. రఘువీరా ప్రశంస!

చంద్రబాబు పాలనను చూసి ఇతర పార్టీల వాళ్ళలో ఏడ్చి చచ్చేవాళ్ళు వున్నట్టే, మనస్పూర్తిగా అభినందించేవాళ్లూ వుంటారు. అలాంటి వారే ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి. జగన్ హయాంలో జరిగిన ప్రజలను బలవంతంగా తరలించడం, నిర్బంధించడం లాంటివేవీ లేకుండా మడకశిర మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నిరాడంబరంగా నిర్వహించడం చాలా బాగుందని రఘువీరా అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగించాలని చెప్పారు. మడకశిర నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడానికి చంద్రబాబు స్పష్టమైన హామీలు ఇవ్వడం పట్ల రఘువీరా సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu