పెద్ద నోట్లపై నోరెత్తని రఘురామ్ రాజన్...

 

పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే పలువురు స్పందించారు. కానీ దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవిని వీడిన తరువాత రఘురాం రాజన్ మాత్రం నోరు మొదపలేదు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ ప్రొఫెసర్ గా ఉన్న ఆయన, అహ్మదాబాద్ ఐఐఎంను సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన అహ్మదాబాద్ లో 'ది గ్లోబల్ ఎకానమీ: ఆపర్చ్యునిటీస్ అండ్ చాలెంజస్' అంశంపై ప్రసంగించారు. అయితే ఆతరువాత నోట్ల రద్దు అంశంపై మాట్లాడతారని అనుకున్నారు. కానీ అది మాత్రం జరగలేదు. బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద సంస్కరణగా, తాను పదవిని వీడిన తరవాత వచ్చిన నోట్ల రద్దుపై ఆయన తన అభిప్రాయాన్ని చెబుతారని పలువురు భావించినా, రాజన్ మాత్రం నోరు మెదపలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu