Latest News

కరెంటు విషయంలో హరీష్ ఆగ్రహం

posted on: Oct 17, 2014 7:11AM

 

తెలంగాణ రాష్ట్రంలో కరెంటు సరఫరా విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాల నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్నారనితెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఈ ప్రాంత రైతాంగానికి విద్యుత్ సరఫరా చేసేలా చేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రోజుకు 15 కోట్లు ఖర్చు చేసి అధిక ధరకు కొనుగోలు చేస్తూ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చుకుంటే 27 మిలియన్ యూనిట్ల కరెంటును అదనంగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ ప్లాంట్లు, భారీ నీటి ప్రాజెక్టులు లేకపోయినా, సింహాద్రి ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయి, అనేక అవాంతరాలు ఎదురైనా రికార్డు స్థాయిలో సరఫరా చేస్తున్నామన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...