ఫోన్‌ ట్యాపింగ్‌ చేసే హక్కు తెలంగాణకు ఉంది..

 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాల్ డేటా ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ కోర్టు తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ప్రతులు ఇవ్వాలనడం న్యాయసమ్మతం కాదని.. ఈ విషయంలో విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసే హక్కు తెలంగాణకు ఉందని.. టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు టీసర్కారు అంగీకరించింది. అయితే ఓటుకు నోటు కేసు వ్యవహారం బయటకు వచ్చిన తరువాతే ఫోన్ ట్యాపింగే చేశామని రాంజెఠ్మలానీ తెలిపారు. కాగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు దీనిపై తీర్పు వెలువరించనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu