పాపం అనుష్కశర్మ

 

బ్యూటీ విత్ బ్రెయిన్ అంటుటారు.. కానీ బ్యూటీ వితవుట్ బ్రెయిన్ అనేలా చేసింది బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ. ఆమె చేసిన మిస్టేక్ ఎంటో తెలిస్తే మీరు కూడా బ్యూటీ వితవుట్ బ్రెయిన్ అని ఒప్పుకుంటారు. ఇంతకీ సంగతేంటంటే భారతదేశం గర్వించదగ్గ మనిషి, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురైంది. ఆయన మరణానికి రాజకీయ నాయకుల దగ్గరనుండి అటు బాలీవుడ్ సెలబ్రిటీలు.. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ సంతాపాన్ని తెలిపారు. అయితే అందరూ ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు కదా మనం కూడా ఒక ట్వీటేద్దాం అనుకుందేమే అనుష్కశర్మ.. అంతే కలాం జీకి ట్వీట్టర్ ద్వారా సంతాపాన్ని తెలిపింది. అయితే అక్కడే అనుష్కశర్మ తప్పులో కాలేసింది. ఈ ముద్దుగుమ్మ ఏపీజే అబ్దుల్ కలాం అని రాయకుండా ఏబీజే కలాం ఆజాద్ అని రాసి ట్వీట్ చేసింది. అయితే తప్పుతెలుసుకొని రెండో సారి మరో ట్వీట్ చేసింది. ఈసారైనా భామ కరెక్ట్ చేసిందంటే అదీ లేదు మళ్లీ అందులో కూడా ‘ఏపీజే కలాం ఆజాద్’ అని తప్పుగా రాసి ఆఖరికి మూడోసారి కరెక్ట్ గా రాయగలిగింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లకు చిరెత్తుకొచ్చి విమర్శలు విసిరారు. పాపం అనుష్కశర్మ బ్యూటీ మీద పెట్టే శ్రద్ద కొంచం జనరల్ నాలెడ్జి మీద పెడితే బావుండు.