Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరోసారి గళం విప్పిన పవన్...రైతులపై శ్రద్ద చూపరా..?
posted on: May 2, 2017 5:41PM
.jpg)
ప్రజా సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి తన గళం విప్పారు. విదేశీ పెట్టుబడులపై చూపించే శ్రద్ద రైతులపై చూపరా..? ప్రభుత్వ వైఖరితోనే రైతులు రోడెక్కే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కష్టించి పంటలు పండించే రైతు కన్నీరు పెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదని, రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. గత ఏడాది క్వింటాల్ మిర్చిధర 13,500 రూపాయలు పలికినందున, ఇప్పుడు కనీసం 11,000 రూపాయల గిట్టుబాటు ధరగా ఇవ్వాలని.. మార్కెట్ ధర, గిట్టుబాటు ధర మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లించాలి అని పవన్ డిమాండ్ చేశారు.
.jpg)



.jpg)


