అందుకే టీడీపీలో చేరా..

 

ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీలోకి.. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి పలువురు నేతలు జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. తాను ఎందుకు టీడీపీలో చేరారో చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. వైసీపీలో పనిచేసే వారికి గుర్తింపు ఉండదని.. వైఎస్సార్సీపీలో ఉండగా తాను మనోవేదన అనుభవించానని.. మనోవేదన భరించలేకే వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరానని చెప్పారు. రాజమండ్రిలోని వైఎస్సార్సీపీ నేతలకు తనను విమర్శించే అర్హత లేదని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబుతోనే నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని అన్నారు.