100 మంది ముస్లిం యువకులు అదృశ్యం... ఉగ్రవాదం వైపా..!

 

ఈ మధ్య కాలంలో ముస్లిం యువకులు అదృశ్యమై వారు ఉగ్రవాద సంస్ధలో చేరుతున్నట్టు వార్తలు వింటూనే ఉన్నాం. ఇటీవలే కేరళలో పలువురు ముస్లిం యువకులు అదృశ్యమయ్యారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలో మరాట్వాడాకు చెందిన ముస్లిం యువకులు అదృశ్యమయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 100 మందికి పైగా ముస్లిం యువకులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. అయితే వీరంతా ఉగ్రవాద సంస్థలో చేరి ఉంటారని భావిస్తున్నారు.

 

ఇంక దీనిపై  శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ ఐఎస్ఐఎస్ కు మద్దతు ఇస్తోందని అన్నారు. అంతేకాదు పలువురి మనసులు బలవంతంగా ఉగ్రవాదం వైపు ప్రభావితం అయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు.