తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. శుక్రవారం (ఏప్రిల్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (ఏప్రిల్ 25) శ్రీవారిని మొత్తం 61 వేల 492 మంది భక్తులు దర్శించుకున్నారు.

శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 72లక్షల రూపాయలు వచ్చింది.