ముగ్గురు ఎమ్మెల్యే లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన మాజీ మంత్రి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతలో అనేక మంది మొక్కలు నాటి ప్రకృతిపై తమ ప్రేమను చాటుతున్నారు.  ఆదిలాబాద్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన మాజీమంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మరో ముగ్గురు ఎమ్మెల్యే లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు  వారియర్ లను మొక్కలు క్కలు నాటాలని కోరారు. ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గౌరవ ముఖ్యమంత్రి చేపడుతున్న హరిత హారం కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తుందన్నారు.