Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మిషన్ కాకతీయ కాదు.. మిషన్ కల్వకుంట్ల...
posted on: Apr 9, 2015 5:55PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘాటుగా విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు మిషన్కాకతీయను మిషన్ కల్వకుంట్లగా మార్చారని వారు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులు మధుయాష్కి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 750మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. తెలంగాణలో 353 మండలాలు కరువుతో తల్లడిల్లుతున్నాయని, వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని అన్నారు. ప్రాణహిత-చేవెళ్లను నిలిపివేయడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు.






