ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ కన్నుమూత

 

Malathi Chandur passes away, Malathi Chandur no more

 

 

ప్రముఖ రచయిత్రి, సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత మాలతీ చందూర్ కన్ను మూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె ఈ రోజు చెన్నైలో కన్నుమూశారు. 1957నుంచి తెలుగు పాత్రికేయరంగంలో ఉన్న ఆమె దాదాపు 25కు పైగా పుస్తకాలను రచించారు. తెలుగు, తమిళం,ఇంగ్లీష్ భాషలలో అనేక రచనలు చేసి ప్రసిద్దిగాంచిన మాలతీ చందూర్ వయసు ఎనభై ఏడు సంవత్సరాలు. అనేక అవార్డులు ,రివార్డులు పొందిన ఆమె ప్రముఖ కాలమిస్టు కూడా. అనేక సంవత్సరాల పాటు పాఠకుల ప్రశ్నలకు సమధానాలు,సలహాలు ఇచ్చారు. మాలతీ చందూర్ స్వస్థలం ఏలూరు.ఆమె చెన్నైలోనే స్థిరపడ్డారు.