జీవితాన్ని త్యాగం చేసిన అమ్మాయిలు

posted on: Apr 24, 2015 10:27AM

 

అమ్మాయిలు, అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలంటే అన్ని వివరాలు తెలుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మరీ అప్పుడు వివాహమాడతారు. అలాంటిది ఇద్దరు యువతులు 20 ఏళ్లుగా మంచంపైనే ఉన్న కవలలను పెళ్లి చేసుకొని వారిలోని మానవత్వాన్ని చాటారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా సామియార్ మఠానికి చెందిన జార్జి విలియమ్, అన్నమ్యాళ్ దంపతులకు విజయకుమార్, జయకుమార్ అనే కవలలు ఉన్నారు. వీరు పదేళ్ల వయసులో ఉన్నప్పుడే మంచం పట్టారు. అప్పటినుండి ఎన్ని ఆస్పత్రులు తిప్పిన ఫలితం మాత్రం ఏం లేదు. ఇప్పుడు వారి వయసు 30 సంవత్సరాలు. 20 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన వీరి గురించి కేరళకు చెందిన మంజూష సామియార్ తెలుకొని వారిపట్ల సానుభూతి తెలిపింది. వీరిద్దరిలో పెద్దవాడైన విజయ్ కుమార్ ను 2012లో వివాహం చేసుకుంది. చిన్నవాడైనా జయకుమార్ సెల్ ఫోన్ ద్వారా పరిచయమైన శివకులదేవి అనే అమ్మాయి పెళ్లి చేసుకుంది. మొదట శివకులదేవి తల్లిదండ్రులు అంగీకరించనప్పటికీ తరువాత ఒప్పుకున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...