జయప్రదకు రాజమండ్రీ టికెట్ దొరికినట్లే

 

ఆమె సోనియాగాంధీని కలిసి గట్టిగా రెండు రోజులయినా కాక మునుపే రాజమండ్రి లోక్ సభ సభ్యడు ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఆమె గనుక రాజమండ్రీ నుండి పోటీ చేయదలిస్తే తానూ ఆమెకు అన్నివిధాల సహకారం అందిస్తానని చెప్పడం విశేషం. తనకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని మారు మాట్లాడకుండా చేపడతానని , ఒక వేళ పార్టీ ఆదిష్టానం తనను రాజ్యసభకు పంపించినా తనకు ఆనందమేనని ఆయన చెప్పడం గమనిస్తే, తానూ లోక్ సభ సీటుని జయప్రదకు అప్పగిస్తునందున బదులుగా పార్టీ తనను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుoదని ఆయన సూచన ప్రాయంగా చెప్పడమే కాకుండా, పార్టీ కూడా ఆదే నిర్ణయించడం వలననే ఆయన ఈ ప్రకటన చేస్తున్నట్లు భావించవచ్చును.ఈ విషయంలో కేంద్రమంత్రి మరియు అలనాటి ఆమె హీరో చిరంజీవి కూడా ఆమె గురించి సోనియాగాంధీ చెవిలో ఒక ముక్క వేసి సాయపడ్డారేమో మరి తెలియదు. ఏమయితేనేమి ఎట్టకేలకు జయప్రద తన పంతం నెగ్గించుకోగలిగారు. ఇక నేదో రేపో మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆమె ప్రకటించడమే తరువాయి.