సరబ్జిత్ సింగ్ పై ఖైదీల దాడి, కోమాలోకి

 

 

 Sarabjeet Singh, Sarabjit Singh critical after attack in Pakistani jail,   Sarabjit Singh Pakistani jail

 

 

పాకిస్థాన్ లోని కోట్ లఖ్ పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత ఖైదీ సరబ్జిత్ సింగ్ నిన్న ఖైదీల దాడిలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన మీద తోటి ఖైదీలు ఇటుకలు, కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన ఇంకా కోమాలోనే ఉన్నాడు. పాక్ లోని జిన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన ఆయన తలకు గాయం కారణంగా కోమాలో ఉన్నారు. ఆపరేషన్ చేసేందుకు ఐసీయూలో ఉంచినా కోమాలో ఉన్న కారణంగా ఎలాంటి శస్త్ర చికిత్స చేయకుండా ఆపారు. ప్రస్తుతం అతను ఉన్న పరిస్థితిలో ఎలాంటి చికిత్స చేయలేమని వైద్యులు చెబుతున్నారు. 23 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్న సరబ్ జిత్ ఉరిశిక్ష పడ్డ ఖైదీ. మరోవైపు సరబ్ జిత్ పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జైలులో ఇంతకుముందు ఓ హత్యతో పాటు అనేక దాడులు జరిగాయి. అఫ్జల్ గురు ఉరి నేపథ్యంలో సరబ్ జిత్ కు భద్రత పెంచారు. నాలుగువేల మంది ఉండాల్సిన ఈ జైలులో 17 వేల మంది ఖైదీలు ఉన్నారు. దాడికి జైలు అధికారులు భాద్యత వహించాలని సరబ్ తరపు న్యాయవాది ఒవైస్ షేక్ డిమాండ్ చేస్తున్నారు.