Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ విషయం 22న డిసైడవుద్ది
posted on: May 15, 2015 12:08PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మీద వున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. గతంలో ఈ కేసులో శిక్ష పడిన సందర్భంగా జయలలిత శాసనసభ సభ్యత్వానికి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈకేసు నుంచి విముక్తి పొందిన నేపథ్యంలో ఆమె మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే జయలలిత నుంచి దీనికి సంబంధించిన సంకేతాలేవీ రాలేదు. ఈ నేపథ్యంలో జయలలిత ఈనెల 22వ తేదీన అన్నా డీఎంకే శాసనసభ్యులతో భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం జయలలిత ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేదీ తెలుస్తుంది. ఈ సమావేశం తర్వాత ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.






