మెరీనా బీచ్ వద్ద ఉద్రిక్తత...

 

చెన్నై  మెరీనా బీచ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమిళనాడు సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేదం విధించడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టగా.. దిగొచ్చిన కేంద్రం జల్లికట్టుకు అనుమతి తెలుపుతూ.. ఆర్డినెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దానిని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆర్డినెన్స్ వచ్చినందుకు ఆందోళన విరమించాలని పోలీసులు విద్యార్ధులను కోరుతున్నారు. అంతేకాదు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం చేస్తున్నారు. కొంతమంది విద్యార్ధులను అదుపులోకి తీసుకొని..బీచ్ కు వెళ్లే రహదారులు మూసివేస్తున్నారు.