Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జల ప్రాజెక్టుల విలన్... జగన్
posted on: Mar 24, 2015 3:39PM

ఆంధ్రపదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పట్టిసీమ ప్రాజెక్టు పై టీడీపీ, వైకాపా ఇరు పక్షాలు గొడవపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో శాసనమండలి ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన పులివెందులలోనే ఈ ర్యాలీ జరగడం విశేషం. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా అధినేత జగన్ పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుపడుతున్నారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు కృష్ణా జలాలు వస్తాయని, లేకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని అన్నారు. వైఎస్ కుటుంబం వల్లే పులివెందుల ఫ్యాక్షన్ కు కేంద్రం అన్న అపఖ్యాతి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.






