చంద్రబాబుపై జగన్ సరికొత్త ఆరోపణ
posted on Jun 23, 2014 2:47PM
వైఎస్ఆర్.కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైన సరికొత్త ఆరోపణ చేశారు. శాసనసభలో జగన్ మాట్లాడుతూ..ప్రస్తుత చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఓఎంసీ అధినేత జనార్దన్రెడ్డితో చంద్రబాబుకు సింగపూర్ లో మీటింగ్ ఏర్పాటు చేశారని ఆపించారు. ఈ విషయంపై ఆధారాలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారి పాస్పోర్టు పరిశీలిస్తే తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణపై కాల్వ శ్రీనివాసులు సమాధానం ఇస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సలహాపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను ఎప్పుడూ సింగపూర్ వెళ్లలేదని.. తనపై చేసిన ఆరోపణను జగన్ నిరూపించాలని సవాల్ చేశారు.