‘ఇద్దరమ్మాయిలతో ’ ఆడియోలో అల్లు అర్జున్ ఉద్వేగం
posted on Apr 29, 2013 4:36PM
.jpg)
స్టైలిష్ స్టార్ అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమా ఆడియో రిలీజ్ శిల్పకళా వేదికలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఆ ఆడియో వేడుకకు దర్శకుడు వి.వి. వినాయన్, రామ్ చరణ్ , దిల్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్ కాస్త ఉద్వేగంగా మాట్లాడాడు. ఫ్యాన్స్ ఇంతగా మెగా ఫ్యామిలీ హీరోలను ఆదరించడం వల్లనే మేము ఇంత స్థాయికి వచ్చామని, ఇంతగా మాకు పేరు రావడానికి చిరంజీవి గారే కారణం. ఆయన తరువాతి స్థానం రామ్ చరణ్ తేజదే అని, రాబోయే పాతికేళ్ళు చరణ్ బిజీ హీరోగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ ప్రసాద్ చక్కటి మ్యూ.జిక్ ఇచ్చాడని, పూరీ జగన్నాథ్ ఈ సినిమా కోసం చాలా శ్రమ పడ్డాడని 100 % ప్రేక్షకులకు నచ్చే చిత్రం అని అన్నాడు.