ఎన్నికల ప్రచారం : పంపు కొట్టిన హేమమాలిని

 

 

 

మధుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీ నుంచి పోటీ చేస్తున్న నటి హేమమాలిని ప్రచారంలో మిగతా పార్టీల అభ్యర్థుల కంటే ముందున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తూ హామీలు గుప్పిస్తున్నారు. ప్రజల్లో మమేకమైపోతు మార్కులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బుగ్గలు తారు రోడ్డు మాదిరిగా స్మూత్‌గా వుంటాయని లాలూ ప్రసాద్ యాదవ్ చేత ప్రశంసలు పొందిన ఈ అందాల ఆంటీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా డొంక రోడ్లలో నడుస్తూ శ్రమిస్తున్నారు. కెంట్ శుద్ధ్ పానీ అంటూ ఫిల్టర్ వాటర్‌కి ప్రచారం చేసే హేమమాలిని ఓ గ్రామంలో బోలెడంత కష్టపడి చేతి పంపు కొట్టింది. అక్కడితో ఆగకుండా సదరు పంపులోంచి వచ్చిన నీటిని కూడా తాగింది. హేమమాలిని లాంటి నటి తమ ఊరికి వచ్చి పంపు కొట్టి, అందులో నీటిని తాగటం చూసి అక్కడి ఓటర్లు మురిసిపోయారట.