పెద్దపల్లిలో  పట్టాలు తప్పిన గూడ్స్ 

తెలంగాణలో  గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది.  పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేటుకు కూత వేటు దూరంలో​ జరిగింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. ఈ గూడ్స్​ రైలు కర్ణాటకలోని బళ్లారి నుంచి యూపీలోని గజియాబాద్​కు వెళుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.కరీంనగర్​, పెద్దపల్లి రైల్వే స్టేషన్లు దాటి తర్వాత రాఘవాపూర్​ వద్ద జరిగింది. భారీ శబ్దంతో పట్టాలు తప్పడంతో సమీప గ్రామాలకు చెందిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్లను ఆయా స్టేషన్ల వద్ద నిలిపివేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu