డాటావిండ్ కొత్త స్మార్ట్ ఫోన్లు

 

డాటావిండ్ సంస్థ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సంస్థ 2జి 4స్మార్ట్ ఫోన్, 3జి 4స్మార్ట్ ఫాన్ అను రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ సంస్థ సీఈఓ సునీత్ సింగ్ తులి హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వీటిని విడుదల చేశారు. 2జి 4స్మార్ట్ ఫోన్ ను 1,999 రూపాయలకు, 3జి 4స్మార్ట్ ఫాన్ ను 2,999 రూపాయలకు అందిస్తున్నట్లు తులి వెల్లడించారు. 2జి 4స్మార్ట్ ఫోన్ 3.5 అంగుళాల డిస్ ప్లే, డ్యూయల్ సిమ్, ఎడ్ట్ నెట్ వర్క్ కంపాటబుల్ కలిగి ఉంటుందని, 3జి 4స్మార్ట్ ఫాన్ 4 అంగుళాల డిస్ ప్లే, డ్యూయల్ సిమ్, డ్యూయల్ కెమెరా కలిగి ఉంటుందని తెలిపారు. ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని, మరో 90 రోజుల్లో తమ వ్యాపారాన్ని భారత్ లో నెలకొల్పనున్నట్లు చెప్పారు.