కేసీఆర్ ను పొగుడుతూ చురక అంటించిన ఎమ్మెస్సార్

వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఒక పార్టీని మించి ఇంకో పార్టీ నేతలు ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే ప్రచారంలో సాధారణంగా ప్రతిపక్షనేతలపై విమర్శలు కురిపిస్తారు.. కానీ ఇక్కడ ఓ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాత్రం కేసీఆర్ పై పొగడ్తలు కురిపించారు. వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఎం. సత్యనారాయణ.. కేసీఆర్ ప్రవేశ పెట్టిన మిషన్ కాకతీయ, గ్రామ జ్యోతి పథకాల ద్వారా అందరికీ మేలు జరుగుతుందని..తెలంగాణలో విద్యుత్ విధానం కూడా చాలా బాగుందని.. కెసీఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని కితాబిచ్చారు. అంతేకాదు అటు పొగుడుతూనే మరో చురక అంటించారు సత్యనారయణ. కేసీఆర్ అందరినీ కలుపుకుంటూ పోవాలని.. దూకుడుగా వెళ్తే మాత్రం ప్రజలు బుద్ధి చెబుతారని ఎద్దేవ చేశారు. చివరిలో కొస మెరుపుగా.. వరంగల్ ఉపఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో ప్రజలకి తెలుసని చెప్పుకొచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu