చిత్తూరు మేయర్ దారుణ హత్య

posted on: Nov 17, 2015 11:56AM

 

చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో వున్న కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ మీద కర్ణాటకు చెందిన ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో కటారి అనురాధ, కటారి మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా కటారి అనురాధ చనిపోయారు. కటారి మోహన్ పరిస్థితి విషమంగా వుండటంతో ఆయనను వేలూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో చిత్తూరులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...