ఇది భార్యా భర్తల సవాల్
posted on Mar 20, 2014 10:17AM
ఎక్కడైనా బావ అంటే ఒప్పుకుంటాను. కానీ వంగతోట కాడ మాత్రం ఒప్పుకోను అంటారు. కానీ ప్రస్తుత కాలంలో ఇది మారిపోయింది. ఎక్కడన్నా భార్య అంటే ఒప్పుకుంటాను. ఎన్నికల వేళ మాత్రం భార్యా భర్తా జాన్తానై అంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ లోకసభా స్థానానికి బీఎస్పీ తరఫున సిట్టింగ్ ఎంపీ ఖాదర్ రాణా పోటీ చేస్తున్నారు.ఆయనకు పోటీగా ఆయన భార్య షాహిదా బేగమ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. రాణా గతంలో సమాజ్ వాదీ పార్టీలో ఉండేవారు. 2007లో ఆయన రాష్ట్రీయ లోకదళ్ లో చేరారు. రెండేళ్లకే బీఎస్పీలోకి దూకేశారు. ఆయనకు కూడా ఇంతిపోరు తప్పడం లేదు. భార్యామణి బరిలో దిగేసరికి ఆయన కంగారు పడుతున్నారు. కొసమెరుపు: ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో మన రాణా మీద కూడా చార్జిషీటు దాఖలైంది.